మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
రజక సంఘం రాష్ట్ర కమిటీ నీ శనివారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మియాపూర్ ఇంధ్రారెడ్డి అల్విన్ కాలనీ కార్యాలయం లో జరిగిన సమావేశం లో కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా లక్ష్మి, ఉపాధ్యక్షులు గా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి గా నాగేశ్వర్ రావు, జాయింట్ సెక్రెటరీ విఘ్నేశ్, కోశాధికారి వీరబాబు, కమిటీ సభ్యులు గా దుర్గ, శివ నారాయణ లను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా లక్ష్మి మాట్లాడుతూ రజకులు ఎదురకొంటున్న సమస్యలను ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. చెరువుల్లో దోబీ ఘాట్ల నిర్మాణం చేపట్టి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ కారిణి చాకలి ఐలమ్మ స్ఫూర్తి తో పెద్దమ్మ తల్లి రజక సంఘాన్ని ఏర్పాటు చేశామని అందరి అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ పలువురు నాయకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…