Telangana

రవి యాదవ్ కు ముదిరాజ్ ల మద్దతు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి లోని పాపి రెడ్డి కాలనీ కి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సాయి నందన్ ముదిరాజ్ ఆద్వర్యంలో సంఘ సభ్యులు శనివారం రోజున గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ ను మసీద్ బండ లోని ఆయన కార్యాలయం లో కలసి సంఘంలో ఉన్న సమస్యల గురించి, పాపి రెడ్డి కాలనీ సమస్యల గురించి చర్చించారు. మురికి కాలువలు, వీధిలైట్లు, డ్రైనేజీ వంటి సమస్యలను ఎవరు పట్టించు కోవడం లేదని, ఎన్నిసార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ప్రభుత్వం అధికారుల పని తీరు ఉందని ఆరోపించారు. అధికారులు స్పందించి సత్వరం చర్య తీసుకోవాలని కోరారు. ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కి రవి యాదవ్ కు సంఘo తరపున ఎప్పటికీ మద్దతునిస్తూ ముందుకు సాగుతామన్నారు. రవి యాదవ్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని సంఘo అధ్యక్షుడు సాయి నందన్ ముదిరాజ్ తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు ఎల్లపుడు తోడు నీడగా మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మారబోయిన రవి యాదవ్ అన్నారు . ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, మందల కృష్ణ ముదిరాజ్, గణేష్, అశోక్, శివాజీ, ఉమేష్, దిలీప్, టిల్లు, గోవర్ధన్,వెంకటేష్, చెన్ని, బాలు, రాజు, వినోద్, కార్తీక్, బాలరాజ్ ముదిరాజ్, బబ్లు, నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago