మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
సర్వం కోల్పోయి కూడు,గూడు, గుడ్డ లేక నిస్సహస్థితిలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఆర్ .కే .వై. టీం ముందుకు వచ్చిoదని ఆర్ కె వై టీమ్ సభ్యులు తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ ఎం.ఎం .టి .ఎస్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేదలకు చలికాలం దృష్టిలో పెట్టుకొని వారికి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ చేతులు మీదుగా దుప్పట్లు పంపిణీ చేయించడం జరిగిందని, ముందు ముందు మరిన్ని సేవాకార్యక్రమాలు చేయనున్నట్లు వారు తెలిపారు. సేవాకార్యక్రమాలు చేపడుతున్న టీమ్ సభ్యులను రవికుమార్ యాదవ్ అభినందించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ఇలాంటి నిరు పేదలు ఎంతో మంది నివసిస్తున్నారని వారందరికీ తెలంగాణ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించినట్లయితే మీరంతా ఇలా రోడ్లపై నివసించే పరిస్థితి ఉండదని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వారిని ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లేష్.గణేష్ ముదిరాజ్.సోమయ్య.అకుల లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, రాము, .మధు,.సంతోష్, క్రాంతి, .చంద్ర మసి రెడ్డి. పాపయ్య, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…