_రామేశ్వరం బండ గ్రామంలో నూతన పాఠశాల భవనం, సిసి రోడ్లు ప్రారంభోత్సవం
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక వసతులతో కూడిన భవనాలు నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలం రామేశ్వరం బండ గ్రామంలో ఒక కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం, 60 లక్షల రూపాయలతో వీకర్ సెక్షన్ కాలనీలో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వ విద్య వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. సరిపడా సిబ్బంది, ఆధునిక వసతులు కల్పిస్తున్న నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు అంతిరెడ్డి, దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, గ్రామ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…