మనవార్తలు ,వెళిమెల:
నిరుపేద రైతుల భూమికి కబ్జాకు పాల్పపడేదుకు తమ పై దౌర్జన్యానికి దిగి తమ భూమిలో ఉన్నా కంచెను, బోర్డు ను తీసేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలిమెల గ్రామంలోని సర్వే నెంబర్ 269 లోని తమకు చెందినది రైతు వై వి శ్రీనాథ్ రెడ్డి ఆరోపించారు. స్థానికంగా.20 సంవత్సరాలుగా భూమి సాగు చేసుకొని జీవిస్తున్న వెలిమెలా గ్రామ వాసి గుడిషెట్టి శ్రీనివాస్ నుండి ఇటివల కొనుగోలు చేశామని శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.
20 గుంటల భూమి కోనుగోలు చేసి, సర్వే చేయించి కంచే వేసుకోవడం జరిగిందని తెలిపారు .అయితే సదురు భూమి హద్దుల పై బిల్డర్ కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. కబ్జాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించామని పోలీసులు సర్వే చేసుకోని ఎవరి హద్దులు వాళ్ళు చూసుకోవాలని సూచించారు. ఐతే ఈ రొజు రవీందర్ రెడ్డి అనుచరులు తమపై దౌర్జన్యం చేసి దాడికి యత్నించడమే కాకుండా భూమి చుట్టూ కంచెను తొలగించాడు ఆని ఆరోపించారు.
రవీందర్ రెడ్డి అతని అనుచరుల నుండీ తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు పిర్యాదు చేసినట్టు వైవి శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.మంత్రుల పేర్లు చెప్పుకొని బెదిరింపులకు పాల్పడుతున్నాడని మంటూర్ బిల్డర్స్ అధినేత రవీందర్ రెడ్డి తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు శ్రీనాథ్ రెడ్డి ఇతర రైతులు ఆరోపించారు. మంతూర్ రవీందర్ రెడ్డి అతని అనుచరుల అగడల పై, భూకబ్జాపై జిల్లా ఎస్పీ తో పాటు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు భాదితులు తెలిపారు.
తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్…
బీరంగూడలో ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం : సమాజంలో అంటరానితనం, వివక్షతకు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం పరిరక్షణకు యోగ అత్యంత అవసరమని ప్రతి ఒక్కరి…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
అమీన్పూర్ ఎస్టిపిని తరలిస్తాం లేదా రద్దు అవసరమైతే ముఖ్యమంత్రితో సైతం చర్చిస్తాము ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు పై ఎమ్మెల్యే జిఎంఆర్…