మనవార్తలు ,వెళిమెల:
నిరుపేద రైతుల భూమికి కబ్జాకు పాల్పపడేదుకు తమ పై దౌర్జన్యానికి దిగి తమ భూమిలో ఉన్నా కంచెను, బోర్డు ను తీసేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలిమెల గ్రామంలోని సర్వే నెంబర్ 269 లోని తమకు చెందినది రైతు వై వి శ్రీనాథ్ రెడ్డి ఆరోపించారు. స్థానికంగా.20 సంవత్సరాలుగా భూమి సాగు చేసుకొని జీవిస్తున్న వెలిమెలా గ్రామ వాసి గుడిషెట్టి శ్రీనివాస్ నుండి ఇటివల కొనుగోలు చేశామని శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.
20 గుంటల భూమి కోనుగోలు చేసి, సర్వే చేయించి కంచే వేసుకోవడం జరిగిందని తెలిపారు .అయితే సదురు భూమి హద్దుల పై బిల్డర్ కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. కబ్జాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించామని పోలీసులు సర్వే చేసుకోని ఎవరి హద్దులు వాళ్ళు చూసుకోవాలని సూచించారు. ఐతే ఈ రొజు రవీందర్ రెడ్డి అనుచరులు తమపై దౌర్జన్యం చేసి దాడికి యత్నించడమే కాకుండా భూమి చుట్టూ కంచెను తొలగించాడు ఆని ఆరోపించారు.
రవీందర్ రెడ్డి అతని అనుచరుల నుండీ తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు పిర్యాదు చేసినట్టు వైవి శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.మంత్రుల పేర్లు చెప్పుకొని బెదిరింపులకు పాల్పడుతున్నాడని మంటూర్ బిల్డర్స్ అధినేత రవీందర్ రెడ్డి తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు శ్రీనాథ్ రెడ్డి ఇతర రైతులు ఆరోపించారు. మంతూర్ రవీందర్ రెడ్డి అతని అనుచరుల అగడల పై, భూకబ్జాపై జిల్లా ఎస్పీ తో పాటు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు భాదితులు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…