Hyderabad

బిగ్ బాస్ 5 నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్

హైదరాబాద్:

తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆక్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్_5 చివరి అంకానికి చేరుకుంది. తాజాగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎటువంటి అంచనాలు లేకుండా హోస్లో అడుగుపెట్టిన పింకీ 90 రోజుల పాటు ఉండటం మామూలు విషయం కాదు. జబర్దస్త్ వంటి షోల ద్వారా పాపులర్ అయిన ఆమె సెప్టెంబర్ 5 వ తేదీన మొదలైన సీజన్5లో 9 వ కంటేస్టెంట్గా హోస్ లో అగుగుపెట్టింది.

ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో తొలిసారిగా ట్రాన్స్ జెండర్ సింహాద్రి తమన్నాని షో లో కి తీసుకొచ్చారు నిర్వహకులు. అయితే ఆమె ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయారు. దీంతో ఈ సీజన్లో పింకీ రావడం.. ఎవరు ఊహించని రీతిలో 90రోజుల పాటు హౌస్లోలో ఉండి ప్రేక్షకులను అలరించింది. తమన్నాకు పూర్తి భిన్నంగా అందరితో కలిసిపోయి ఆకట్టుకుంది.అటు షో లో ప్రియాంక ఎక్కువగా మానస్‌కు దగ్గరగా ఉండేది. అతడికి అవసరమైన సేవలన్నింటినీ చేసేది.తనని ఎవరైనా నామినేట్‌ చేస్తే, తిరిగి వారిని నామినేట్‌ చేయటం, వారిపైన అరవడం చేసేది.

వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ ఇచ్చినా తట్టుకోలేకపోయేది. ఎవరైనా కౌంటర్ ఇస్తే కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చేది. ఏ చిన్న టాస్క్‌ జరిగినా ఎక్కువ మందిని కార్నర్‌ చేసేది కాదు. అయితే ఇన్ని రోజుల జర్నీలో ప్రియాంక ఒక్క టాస్క్‌లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఒక్క సూపర్‌ విలన్స్‌, సూపర్‌ హీరోస్‌ టాస్క్‌లో మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. ప్రత్యర్థి సభ్యులు పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గింది. కానీ, కెప్టెన్‌ కాలేకపోయింది. మొత్తంగా ట్రాన్స్ జెండర్గ్గా ప్రియాంక 90 రోజుల పాటు హౌస్ లో ఉండి ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడం సామాన్య విషయం కాదంటున్నారు అభిమానులు. షో నుంచి బయటకి వచ్చిన ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు.

Ramesh

Recent Posts

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

1 hour ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

1 hour ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

1 hour ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

1 hour ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

1 day ago

ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…

1 day ago