Districts

గీతం స్కాలర్ వరప్రసాద్కు డాక్టరేట్…..

పటాన్ చెరు:

‘ కాగ్నిటివ్ రేడియో నెట్వర్క్లో ప్రాథమిక వినియోగదారుడిని గుర్తించడం కోసం అత్యాధునిక మెషిన్ లెర్నింగ్ పద్ధతులను వినియోగించడం ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం పరిశోధక విద్యార్థి కె.వెంకట వరప్రసాద్ ను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఈఈసీఈ ప్రొఫెసర్ టి.త్రినాథరావు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .

కాగ్నిటివ్ రేడియో అభివృద్ధి చెందుతున్న , ఆకర్షణీయమైన సాంకేతికతని , ఇది స్పెక్ట్రమ్ కొరత సమస్యకు పరిష్కారాన్ని చూపుతుందని ఆయన తెలిపారు . ఈ నెట్వర్క్ లెసైన్స్ పొందనివారు ప్రాథమిక వినియోగదారునికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా స్పెక్ట్రమ్ను వినియోగించుకుంటారన్నారు . ఈ నెట్వర్క్ ప్రాథమిక వినియోగదారుడి గుర్తింపే ప్రధాన సమస్య అని , వారిని గుర్తించడం కోసం అదనపు శక్తిని వినియోగించే విధానాన్ని సిద్ధాంతంలో ప్రతిపాదించినట్టు తెలిపారు .

ఈ పనిని రియల్ టెమ్ వెరైస్ సెన్సార్ నెట్వర్క్ ఫీల్డ్లలో అన్వయించవచ్చన్నారు . ఈ పరిశోధన రేడియో స్పెక్ట్రమ్ కొరతను అధిగమించడానికి , ఉపగ్రహ సమాచార ప్రసారాలు , సేవల నాణ్యతను మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు . వరప్రసాద్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , ఇంజనీరింగ్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీకే మిట్టల్ , పలువురు విభాగాధిపతులు , అధ్యాపకులు తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో వివరించారు .

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago