మన వార్తలు ,పటాన్ చెరు:
ఓ అధ్యాపకుడు , ఒక పరిశోధనా ప్రాజెక్టుకు ప్రభుత్వ సంస్థల నుంచి నిధులు పొందాలంటే , బడ్జెట్ కంటే ప్రతిపాదన నాణ్యత చాలా ముఖ్యమని భారత శాస్త్ర సాంకేతిక విభాగం ( డీఎస్టీ ) పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద రాజు అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ పరిశోధనా ప్రాజెక్టులకు బయటి నుంచి నిధుల సమీకరణ అవకాశాలు , ప్రభావశీలంగా ప్రతిపాదనను రూపొందించడం ‘ అనే అంశంపై మంగళవారం ఆయన అధ్యాపకులతో ముఖాముఖి చర్చించారు . ఒక ప్రతిపాదనకు సంక్షిప్త నేపథ్యం లేదా పరిచయం ఉండాలని , అమలు ప్రణాళిక , ఆశించిన ఫలితం , విశిష్టమైన కీలక ఐదారు పదాలను ఉటంకించాలని డాక్టర్ రాజు స్పష్టీకరించారు . ప్రాజెక్టు ప్రతిపాదన నిర్దిష్టంగా ఉండాలని , సాధారణ అంశాలను నివారించాలన్నారు .
మనదేశంలో పరిశోధనా నిధుల అవకాశాల గురించి , సమర్థవంతమైన పరిశోధన ప్రతిపాదనను ఎలా రూపొందించాలి , ప్రతిపాదనల సమర్పణ చిట్కాలు వంటి వాటి గురించి ఆయన వివరించారు . ఒక సమస్యకు తార్కిక పురోగతిలో కేంద్రీకృత పరిష్కారాన్ని అందించడం విజయవంతమైన మంజూరు ప్రతిపాదనగా అభివర్ణించారు . పరిశోధనా నిధులను సాధించాలంటే , వినూత్న ప్రతిపాదనలోని ప్రత్యేకమైన అంశాలను ప్రముఖంగా ప్రస్తావించాలని , ఊహించిన విజయాలు , కొత్త పరికల్పనను తీసుకురావడం , లక్ష్యాల సాధన కోసం సమయపాలనను పేర్కొనడం వంటి కీలకమైన సాంకేతిక మెల్దురాళ్ల జాబితాను డాక్టర్ రాజు ఏకరువుపెట్టారు .
సెర్చ్ , డీఎస్టీ , డీబీటీ , డీఏఆర్ఆస్ఈ , ఐసీఏఆర్ , డీఏఈ , డీఆర్డీవోలతో సహా సీపీఆర్ఎస్ఐ , ఇస్రో , ఏఐసీటీఈ , సీఐఎస్ఆర్ , యూజీసీ వంటి పరిశోధనలకు నిధులను మంజూరు చేస్తున్న పలు ప్రభుత్వ సంస్థల జాబితాను ఆయన వివరించారు . తొలుత , గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్.శివప్రాద్ , ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ నీకే మిట్టల్ అతిథిని స్వాగతించగా , డాక్టర్ పి . ఈశ్వరయ్య ఆయనను అధ్యాపకులకు పరిచయం చేశారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…