మన వార్తలు ,పటాన్ చెరు:
ఓ అధ్యాపకుడు , ఒక పరిశోధనా ప్రాజెక్టుకు ప్రభుత్వ సంస్థల నుంచి నిధులు పొందాలంటే , బడ్జెట్ కంటే ప్రతిపాదన నాణ్యత చాలా ముఖ్యమని భారత శాస్త్ర సాంకేతిక విభాగం ( డీఎస్టీ ) పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద రాజు అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ పరిశోధనా ప్రాజెక్టులకు బయటి నుంచి నిధుల సమీకరణ అవకాశాలు , ప్రభావశీలంగా ప్రతిపాదనను రూపొందించడం ‘ అనే అంశంపై మంగళవారం ఆయన అధ్యాపకులతో ముఖాముఖి చర్చించారు . ఒక ప్రతిపాదనకు సంక్షిప్త నేపథ్యం లేదా పరిచయం ఉండాలని , అమలు ప్రణాళిక , ఆశించిన ఫలితం , విశిష్టమైన కీలక ఐదారు పదాలను ఉటంకించాలని డాక్టర్ రాజు స్పష్టీకరించారు . ప్రాజెక్టు ప్రతిపాదన నిర్దిష్టంగా ఉండాలని , సాధారణ అంశాలను నివారించాలన్నారు .
మనదేశంలో పరిశోధనా నిధుల అవకాశాల గురించి , సమర్థవంతమైన పరిశోధన ప్రతిపాదనను ఎలా రూపొందించాలి , ప్రతిపాదనల సమర్పణ చిట్కాలు వంటి వాటి గురించి ఆయన వివరించారు . ఒక సమస్యకు తార్కిక పురోగతిలో కేంద్రీకృత పరిష్కారాన్ని అందించడం విజయవంతమైన మంజూరు ప్రతిపాదనగా అభివర్ణించారు . పరిశోధనా నిధులను సాధించాలంటే , వినూత్న ప్రతిపాదనలోని ప్రత్యేకమైన అంశాలను ప్రముఖంగా ప్రస్తావించాలని , ఊహించిన విజయాలు , కొత్త పరికల్పనను తీసుకురావడం , లక్ష్యాల సాధన కోసం సమయపాలనను పేర్కొనడం వంటి కీలకమైన సాంకేతిక మెల్దురాళ్ల జాబితాను డాక్టర్ రాజు ఏకరువుపెట్టారు .
సెర్చ్ , డీఎస్టీ , డీబీటీ , డీఏఆర్ఆస్ఈ , ఐసీఏఆర్ , డీఏఈ , డీఆర్డీవోలతో సహా సీపీఆర్ఎస్ఐ , ఇస్రో , ఏఐసీటీఈ , సీఐఎస్ఆర్ , యూజీసీ వంటి పరిశోధనలకు నిధులను మంజూరు చేస్తున్న పలు ప్రభుత్వ సంస్థల జాబితాను ఆయన వివరించారు . తొలుత , గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్.శివప్రాద్ , ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ నీకే మిట్టల్ అతిథిని స్వాగతించగా , డాక్టర్ పి . ఈశ్వరయ్య ఆయనను అధ్యాపకులకు పరిచయం చేశారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…