పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో విశిష్ట వక్తగా పాల్గొని, తన నైపుణ్యాలను ఇతరులతో పంచుకుంటున్నట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. భువనేశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల ఈనెల 1-2 తేదీలలో డేటా ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆమె విశిష్ట వక్తగా పాల్గొన్నట్టు తెలిపారు. అందులో ఆమె ఐవోటీ, సెన్సార్ టెక్నాలజీలపై అంతర్దృష్టితో కూడిన ప్రసంగం చేయడమే గాక, అత్యాధునిక దృక్పథాలు, వాస్తవ ప్రపంచ వినియోగాలను పరిచయం చేసినట్టు పేర్కొన్నారు.
ఇది ఆయా ప్రతినిధుల ప్రశంసలను అందుకోవడమే గాక, విశిష్ట అతిథులు కేఐఐటీ రీసెర్చ్ డీన్ ప్రొఫెసర్ గణపతి పాండా, బీసీయూటీ ఉప కులపతి ప్రొఫెసర్ ఎ.రత్, ఎస్ఓఏ విశ్వవిద్యాలయ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ పి.కె.పాత్ర, ఐఎంఐటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ దేబీప్రసాద్ దాస్ వంటి ప్రముఖులు ఆమెను సత్కరించినట్టు తెలియజేశారు.దీనికి ముందు, ఇండోర్ లోని శ్రీ వైష్ణవి విద్యాపీఠ్ విశ్వవిద్యాలయ సహకారంతో భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ)లోని విద్యా, పరిపాలనాభివృద్ధి కేంద్రం (ఏఏడీసీ) నిర్వహించిన అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్ డీపీ)లో కూడా ప్రొఫెసర్ పర్వేకర్ విశిష్ట వక్తగా పాల్గొన్నట్టు తెలిపారు.
పరిశోధనను సాధికారపరచడం: ప్రభావవంతమైన పరిశోధన అభివృద్ధికి సాధనాలు, సాంకేతికలు అనే ఇతివృత్తంతో ఈ ఎఫ్ డీపీ సాగిందన్నారు. పరిశోధన నీతి, కాపీరైట్ సాధనాలు, ఉత్తమ పద్ధతులపై ప్రభావవంతమైన సెషన్ ను పర్వేకర్ నిర్వహించి, విద్యా పరిశోధనలో సమగ్రత, నాణ్యత యొక్క ప్రాముఖ్యతను వివరించినట్టు తెలియజేశారు.విశ్వవిద్యాలయం తరఫున పలు వేదికలలో ప్రొఫెసర్ పర్వేకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు పలువురు గీతం ఉన్నతాధికారులు హర్షం వెలిబుచ్చారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…