Telangana

రాష్ట్ర, జాతీయ క్రీడలకు చిరునామా పటాన్ చెరు _ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా కోకో క్రీడలు

విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్ర, జాతీయ క్రీడలకు వేదికగా పటాన్ చెరు పట్టణాన్ని తీర్చిదిదరుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా గత మూడు రోజులుగా జరుగుతున్న 44వ తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా అండర్ 14 బాలుర బాలికల కోకో క్రీడా పోటీలు ఆదివారం ఘనంగా ముగిసాయి. ముగింపు వేడుకలకు పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. అండర్ 14 బాలుర విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో, రంగారెడ్డి జిల్లా జట్టు రెండవ స్థానంలో, హైదరాబాద్ జట్టు మూడో స్థానంలో నిలిచాయి అండర్ 14 బాలికల విభాగంలో ఆదిలాబాద్ ప్రథమ స్థానంలో మహబూబ్నగర్ రెండవ స్థానంలో, నల్లగొండ మూడవ స్థానంలో నిలిచాయి.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వతహాగా క్రీడాకారుడునైన తనకు క్రీడారంగాన్ని ప్రోత్సహించడం సంతోషాన్ని అందిస్తుందని తెలిపారు.

క్రీడలకు కేంద్రంగా పటాన్ చెరును తీర్చిదిద్దడంలో భాగంగా ఏడు కోట్ల రూపాయలతో మైత్రి మైదానాన్ని ఆధునికరించామని గుర్తు చేశారు. ఏడాది పొడవున వివిధ అంశాల్లో క్రీడలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందిస్తే మానసిక ఆరోగ్యం, శారీరక ధారుడ్యంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని క్రీడలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. క్రీడాకారుల కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో ఉచిత వసతి, భోజనం, బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా కోకో జాతీయ జట్టుకు కోచ్ గా వ్యవహరించిన నరేష్, రిఫరీ నరేష్ లను ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కోకో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, సీఐ వినాయక రెడ్డి, జిల్లా అధ్యక్షులు హరికిషన్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, కోకో అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago