Hyderabad

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – రంగారెడ్డి సిఐటియు శ్రామిక మహిళ కార్యదర్శి కవిత

మనవార్తలు ,శేరిలింగంపల్లి :

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు శేరిలింగంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఎంఈఓ కార్యాలయం ముందు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా సిఐటియు శ్రామిక మహిళ కార్యదర్శి కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతూ పేపర్లో ప్రకటనలకే పరిమితమవుతుంది. మధ్యాహ్న భోజనం వండుతున్న కార్మికులకు గత సెప్టెంబర్ నుండి బిల్లులు మంజూరు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులే తమ సొంత డబ్బులతో విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారని ప్రభుత్వం ఇప్పటిదాకా నిధులను మంజూరు చేయకపోవడంపై ఆమె ఆగ్రాన్ని వ్యక్తం చేశారు.

గతంలో నాలుగు రూపాయలు ఉన్న గుడ్డు ధర నేడు ఐదు నుండి ఆరు రూపాయలు ఉందని ఇప్పటివరకు గుడ్డు రేటు విషయంలో ప్రభుత్వం పెంచిన జీవనం అమలు చేయడం లేదని అందుకు అనుగుణంగా ఎక్కడ నిధులు ఇవ్వడం లేదని తెలిపారు. చివరికి పిల్లలకు ఇచ్చే బియ్యం సైతం నాసిరకంగా ఉంటున్నాయని వీటివల్ల పిల్లల తల్లిదండ్రులు కార్మికులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. వీటన్నిటిపై వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల కార్యదర్శి కొంగర కృష్ణ ముదిరాజ్, సువర్ణ, రాములు, షేక్ నస్రిన్, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago