మనవార్తలు ,పటాన్ చెరు;
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్న పథకాలకు శ్రీ కారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంగా మారిందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని లక్డారం గ్రామ పరిధిలోని అమర్ కుమార్తె వివాహానికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ 15 వేల ఆర్థిక సాయం అందించారు.
పేదింటి తల్లిదండ్రులు బిడ్డల వివాహానాకి ఎన్నో కష్టాలు పడుతున్నారని..టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ అన్నలా లక్ష నూటపదహార్ల రూపాయలు అందిస్తున్నాడని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో తమ గ్రామ పరిధిలో వివాహం చేసుకునే పేద బిడ్డలకు తనవంతు సాయంగా సహాయం అందిస్తున్నట్లు నీలం మధు ముదిరాజ్ తెలిపారు .కష్టల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రజలకు సేవ చేసేందుకు తాను ఎప్పుడు ముందుంటానని తెలిపారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో విద్యార్థులకు మార్గనిర్దేశం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో విద్యార్థులకు…
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…