Telangana

సమస్య-పరిష్కారం.. విజయానికి సోపానం

_గీతం ఆతిథ్య ఉపన్యాసంలో ఎన్ఐటీ రూర్కెలా ప్రొఫెసర్ సింగం జయంతు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

మన చుట్టూ ఉన్న సమాజంలోని సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలు చూపగలగడం విజయానికి తొలి మెట్టుగా ఎన్ఐటీ రూర్కెలాలోని మెజ్లింగ్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సింగం జయంతు అభివర్ణించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘వాలుల స్థిరత్వంపై జియోటెక్నికల్ పరిశోధన’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఓ సనుస్యను పరిస్కరించాలనే ఉమ్మడి లక్ష్యంతో, దానిని ఓ ప్రాజెక్టుగా విద్యార్థులు చేపట్టి, వినూత్న పరిష్కారాలతో అద్భుత ఫలితాలను సాధించవచ్చని సూచించారు.తవ్వకం పూర్తయిన ఓపెన్కాస్ట్ గనులను పూడ్చి, ఆ భూమిని వ్యవసాయానికి పనికొచ్చేలా పునర్వినియోగంలోకి తెచ్చే మార్గాలను, అందులో అనుసరించాల్సిన మెళకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. గనులు తవ్వేప్పుడు వచ్చిన మట్టి, వ్యర్థాలతో ఫ్లైయాష్ ను కూడా 3:1 నిష్పత్తిలో కలిపి, వాటిని పూడ్చడానికి వాడాలన్నారు. దానిని బాగా చదును చేయడంతో పాటు రెండు మీటర్ల పైపొరను సారవంతమైన మట్టితో నింపితే, వ్యవసాయం చేసి, పంటలు పండించొచ్చని ప్రొఫెసర్ సింగం తెలియజేశారు. ఈ రంగంలో సహకారం, అవిష్కరణల అవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు.తొలుత, కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి. రామశాస్త్రి అతిథిని పరిచయం చేయగా, ఉపన్యాసం ముగిశాక సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి అఖిలేష్ దేపూరి అతిథిని సత్కరించారు.హెబ్రీడ్ విధానంలో నిర్వహించిన ఈ అతిథ్య ఉపన్యాస కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. మెల్డింగ్ ఇంజనీరింగ్లో వినూత్న పరిశోధనలు, తాజా పురోగతిపేటై అనగాహనను ఏర్పరచుకున్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago