ASHA-WORKERS.jpg
పటాన్ చెరు
ఆశా వర్కర్ల కు పి ఆర్ సి అమలు చేసి,కనీస వేతనం 21వేల రూపాయలు పెంచాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు పిఆర్సి అమలుచేసి కనీస వేతనం 21 వేలు పెంచాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని భానూర్ పి హెచ్ సి సెంటర్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆశా వర్కర్ల కు 11 వ పి అర్ సి ప్రకారం వేతనాలు పెంచి,వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆశా వర్కర్ల కు పీఆర్సీ అమలు చేస్తున్నామని ప్రకటించిన దని అన్నారు.4నెలలు గడిచినా నేటికీ చెల్లించ లేదని మండిపడ్డారు.కనీస వేతనం 21వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న,ఆశా వర్కర్ల ను రెగ్యులర్ చేయడం లేదని అన్నారు.రెగ్యులర్ చేయాలని అన్నారు.ప్రస్తుతం వచ్చే వేతనాలు 7500/-రూపాయిలు సరిపోవడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశావర్కర్ల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఆశ వర్కర్లు లక్ష్మి, మాధవి, భాగ్య, లక్ష్మి ఇతరులు పాల్గోన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…