పటాన్చెరు
పటాన్చెరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఉదయం నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో కలిసి పుష్ప గుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శాసన మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి లను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
సమిష్టి సహకారం తో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 270 పడకలతో ఏర్పాటు కాబోతున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో పేద ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రానున్నట్టు ఆయన తెలిపారు.
ఇప్పటికే ఆసుపత్రికి సంబంధించిన స్థలం సంబంధిత శాఖకు బదిలీ అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్లు నరసింహ గౌడ్, రాములు గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆదర్శ రెడ్డి, నగేష్ యాదవ్, విజయ్ కుమార్, బాల్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, పాండు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…