Telangana

ధరణి పోర్టల్ ద్వారా పేద రైతులు నష్టపోతున్నారు – గడిల శ్రీకాంత్ గౌడ్

_బి ఆర్ ఎస్ నేతలు ధరణి పేరుతో రైతులను దోచుకుంటున్నారు

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

ధరణి పోర్టల్ ద్వారా పేద రైతులు నష్టపోతున్నారని బీజేపీ నేత గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. పటాన్ చేరు నియోజకవర్గంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని … రెవెన్యూ అధికారుల అండదండలతో ముఖ్యమంత్రి కేసిఆర్ నుండి మొదలుకొని బారస మంత్రులు, ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయి నాయకుల వరకు అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నారని ఆరోపించాడు.ధరణి పోర్టల్ లో ఉన్న రైతుల భూములకు సమస్యలను సృష్టించి వారే పరిష్కరిస్తున్నారని అయిన అన్నారు.సమస్యను పరిష్కరించడానికి పేద రైతులను అమయాకపు భూ యజమానులను భయబ్రాంతులకు గురిచేసి వారి భూములను అక్రమంగా ఆక్రమించి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని‌ ఆయన మండిపడ్డారు.ప్రభుత్వం వెంటనే వారి సమస్యల్ని పరిష్కరించాలని లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాలు , మండల కార్యాలయాలు ,ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. ధరణి సమస్యల పరిస్కారం కోసం భారతీయ జనతాపార్టీ తరపున పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. .

ఈ కార్యక్రమంలో బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మధుకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు జోగు ధన్ రాజ్, మరియు ఎస్.ఆర్.కే యువసేన సభ్యులు శకిల్, రాజ్ గోపాల్, దుర్గా సాయి, ఆదిత్య,నవిన్ తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

5 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

5 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

5 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

2 weeks ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

2 weeks ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

2 weeks ago