Telangana

వినూత్న పరిష్కారాలతో విధాన నిర్ణయాలు

కౌటిల్య కాలోక్వీలో నిపుణుల సూచన

విజయవంతంగా ముగిసిన పబ్లిక్ పాలసీ వార్షిక సమావేశం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రజా విధానాన్ని రూపొందించడంలో అంతర్-విభాగ విధానాలు, వినూత్న పరిష్కారాలు, సహకార ప్రయత్నాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) మూడో వార్షిక సమావేశాన్ని ‘కౌటిల్య కాలోక్వీ’ పేరిట శనివారం విజయవంతంగా నిర్వహించింది. ‘అస్థిర, అనిశ్చిత, సంక్లిష్టమైన, అస్పష్టమైన (వీయూసీఏ) ప్రపంచం ద్వారా మార్గనిర్దేశనం’ ఇతివృత్తంగా నిర్వహించిన ఈ సదస్సు ప్రపంచ, జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి ఆలోచనాపరులు, పండితులు (స్కాలర్లు) అభ్యాసకులు, విద్యార్థులను ఒకచోట చేర్చింది. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో ప్యానెల్ చర్చలు, పత్ర సమర్పణ, నిర్ధిష్ట పనిని పూర్తిచేయడానికి నిర్ధేశిత సమయం (పాలసీ స్ప్రింట్) తదితరాలు ఉన్నాయి. జ్జాన మార్పిడి, విధాన ఆవిష్కరణలకు క్రియాశీలకమైన వేదికగా ఈ సమావేశం తోడ్పడింది.‘భారతదేశానికి ఫిన్ టెక్ – ముందుకు సాగే మార్గం’, ‘స్థిరమైన భవిష్యత్తు: వీయూసీఏ ప్రపంచంలో వాతావరణ విధానం’ పేరిట ప్యానెల్ చర్చలను నిర్వహించారు.

ఫిన్ టెక్ చర్చలో ఇండియా బ్లాక్ చైన్ ఫోరం అధ్యక్షుడు ప్రసన్న లోహర్, మాస్టర్ కార్డ్ దక్షిణాసియా అధిపతి అభిషేక్ లాహిరి, డీవీజీ గ్రూపు వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి రాఘవన్ వెంకటేశన్ పాల్గొన్నారు. ఈ చర్చలను కౌటిల్య అసిస్టెంట్ డీన్ (పరిశోధన) డాక్టర్ అమ రేంద్ర పాండే సమన్వయం చేశారు. స్థిరమైన భవిష్యత్తుపై జరిగిన చర్చలో క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ ఆర్తి ఖోస్లా, ఏథర్ ఎనర్జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రతా మిత్రా, సస్టైనబిలిటీ సొల్యూషన్ రీసైకల్ లీడ్ డాక్టర్ స్వాతి సింగ్ పాల్గొన్నారు.

ఆయా చర్చలలో ప్రధానంగా వాతావరణ మార్పు, పర్యావరణ, సామాజిక పాలన (ఈఎస్జీ) కార్యక్రమం, ఆర్థిక వృద్ధి, సామాజిక సమానత్వం, పర్యావరణ బాధ్యతలను పరిశీలించడంతో పాటు కార్బన్ సుంకాలు, స్థిరమైన వాణిజ్య పద్ధతులు వంటి ప్రపంచ విధానాల గురించి చర్చించారు.ఆర్థిక స్థితిస్థాపకత, ఈఎస్జీ విధానాలు, డిజిటల్ గవర్నెన్స్, కృత్రిమ మేధస్సు (ఏఐ), జియోపాలిటిక్స్, సమ్మిళిత పాలన వంటి ఇతివృత్తాలపై విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తలు పరిశోధనా పత్రాలను సమర్పించారు.ఇక పాలసీ స్ప్రింట్ లో స్థిరత్వం, పట్టణ పాలన, సాంకేతిక అంతరాయంపై దృష్టి సారించి, వినూత్నమైన, ఆధార సహిత, అందుబాటులోని విధాన ప్రతిపాదనలను రూపొందించారు. అంతేగాక, జట్ల మార్గదర్శకత్వం, నిపుణుల అభిప్రాయం, విధాన అభ్యాసకులతో పరిచయాలను పొందారు.ఈ చర్చలు, చొరవల ద్వారా కార్యాచరణపై లోతైన అవగాహనతో పాటు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే విధాన సిఫార్సులను రూపొందించడానికి ప్రయత్నించారు. ఈ సమావేశం నుంచి వెలువడే ఆలోచనలు భవిష్యత్తు పద్ధతులను తెలియజేస్తాయని, సమ్మిళిత, డేటా-ఆధారిత, స్థిరమైన పాలన చట్రాలను పెంపొందిస్తాయని కేఎస్ పీపీ విద్యార్థులు భావిస్తున్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

14 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago