Telangana

గూడెం కార్మికులకు ఆపన్న హస్తం

సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో గాయపడ్డ కార్మికుడికి అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రమాదంలో కుడి చేయి కోల్పోయిన కార్మికుడు అమర్ సింగ్

యాజమాన్యంతో మాట్లాడి రూ.25 లక్షల పరిహారం అందచేత

భవిష్యత్తులో అండగా ఉంటానని భరోసా

ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కార్మిక నేపథ్యం నుంచి వచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.పటాన్ చెరు పారిశ్రామికవాడలో ఎక్కడ ప్రమాదం జరిగిన కార్మికుల పక్షాన నిలబడుతూ యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన పరిహారం అందిస్తూ కార్మిక పక్షపాతిగా నిలుస్తున్నారు.గతంలో అగర్వాల్ రబ్బర్ ఫ్యాక్టరీలో మరణించిన కార్మికుడికి 60 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇప్పించిన తరహాలోనేఇదే రీతిలో పటాన్ చెరు లోని సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ కార్మికుడికి ఆపన్న హస్తం అందించారు.గత శనివారం శ్రీ సాయిబాబా సెల్యులోస్ పరిశ్రమలో ప్రమాదవశాత్తూ అమర్ సింగ్ అనే కార్మికుడు (59) తీవ్రంగా గాయపడ్డాడు. మెషిన్ లో పడి కుడి చేయిని కోల్పోయాడు. దీంతో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు కార్మికులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆశ్రయించారు.దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గూడెం బాధిత కార్మికుడికి మెరుగైన చికిత్స అందించాలని ద్రువ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. అనంతరం శ్రీ సాయి బాబా సెల్యులోజ్ పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి వారిని ఒప్పించి రూ.25 లక్షల పరిహారాన్ని ఇప్పించారు. బుధవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆర్థిక సహాయాన్ని అందించారు.భవిష్యత్తులోనూ అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కార్మికుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారాన్ని మర్చిపోలేమన్నారు. కార్మికుల పక్షాన నిలబడి సహాయం చేస్తున్న జిఎంఆర్ కు తామంతా రుణపడి ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజన్ సింగ్, ఆకుల శ్రీశైలం, పరిశ్రమ ప్రతినిధులు, బొందిలి సంక్షేమ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

10 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago