Telangana

వినూత్న పరిష్కారాలతో విధాన నిర్ణయాలు

కౌటిల్య కాలోక్వీలో నిపుణుల సూచన

విజయవంతంగా ముగిసిన పబ్లిక్ పాలసీ వార్షిక సమావేశం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రజా విధానాన్ని రూపొందించడంలో అంతర్-విభాగ విధానాలు, వినూత్న పరిష్కారాలు, సహకార ప్రయత్నాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) మూడో వార్షిక సమావేశాన్ని ‘కౌటిల్య కాలోక్వీ’ పేరిట శనివారం విజయవంతంగా నిర్వహించింది. ‘అస్థిర, అనిశ్చిత, సంక్లిష్టమైన, అస్పష్టమైన (వీయూసీఏ) ప్రపంచం ద్వారా మార్గనిర్దేశనం’ ఇతివృత్తంగా నిర్వహించిన ఈ సదస్సు ప్రపంచ, జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి ఆలోచనాపరులు, పండితులు (స్కాలర్లు) అభ్యాసకులు, విద్యార్థులను ఒకచోట చేర్చింది. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో ప్యానెల్ చర్చలు, పత్ర సమర్పణ, నిర్ధిష్ట పనిని పూర్తిచేయడానికి నిర్ధేశిత సమయం (పాలసీ స్ప్రింట్) తదితరాలు ఉన్నాయి. జ్జాన మార్పిడి, విధాన ఆవిష్కరణలకు క్రియాశీలకమైన వేదికగా ఈ సమావేశం తోడ్పడింది.‘భారతదేశానికి ఫిన్ టెక్ – ముందుకు సాగే మార్గం’, ‘స్థిరమైన భవిష్యత్తు: వీయూసీఏ ప్రపంచంలో వాతావరణ విధానం’ పేరిట ప్యానెల్ చర్చలను నిర్వహించారు.

ఫిన్ టెక్ చర్చలో ఇండియా బ్లాక్ చైన్ ఫోరం అధ్యక్షుడు ప్రసన్న లోహర్, మాస్టర్ కార్డ్ దక్షిణాసియా అధిపతి అభిషేక్ లాహిరి, డీవీజీ గ్రూపు వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి రాఘవన్ వెంకటేశన్ పాల్గొన్నారు. ఈ చర్చలను కౌటిల్య అసిస్టెంట్ డీన్ (పరిశోధన) డాక్టర్ అమ రేంద్ర పాండే సమన్వయం చేశారు. స్థిరమైన భవిష్యత్తుపై జరిగిన చర్చలో క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ ఆర్తి ఖోస్లా, ఏథర్ ఎనర్జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రతా మిత్రా, సస్టైనబిలిటీ సొల్యూషన్ రీసైకల్ లీడ్ డాక్టర్ స్వాతి సింగ్ పాల్గొన్నారు.

ఆయా చర్చలలో ప్రధానంగా వాతావరణ మార్పు, పర్యావరణ, సామాజిక పాలన (ఈఎస్జీ) కార్యక్రమం, ఆర్థిక వృద్ధి, సామాజిక సమానత్వం, పర్యావరణ బాధ్యతలను పరిశీలించడంతో పాటు కార్బన్ సుంకాలు, స్థిరమైన వాణిజ్య పద్ధతులు వంటి ప్రపంచ విధానాల గురించి చర్చించారు.ఆర్థిక స్థితిస్థాపకత, ఈఎస్జీ విధానాలు, డిజిటల్ గవర్నెన్స్, కృత్రిమ మేధస్సు (ఏఐ), జియోపాలిటిక్స్, సమ్మిళిత పాలన వంటి ఇతివృత్తాలపై విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తలు పరిశోధనా పత్రాలను సమర్పించారు.ఇక పాలసీ స్ప్రింట్ లో స్థిరత్వం, పట్టణ పాలన, సాంకేతిక అంతరాయంపై దృష్టి సారించి, వినూత్నమైన, ఆధార సహిత, అందుబాటులోని విధాన ప్రతిపాదనలను రూపొందించారు. అంతేగాక, జట్ల మార్గదర్శకత్వం, నిపుణుల అభిప్రాయం, విధాన అభ్యాసకులతో పరిచయాలను పొందారు.ఈ చర్చలు, చొరవల ద్వారా కార్యాచరణపై లోతైన అవగాహనతో పాటు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే విధాన సిఫార్సులను రూపొందించడానికి ప్రయత్నించారు. ఈ సమావేశం నుంచి వెలువడే ఆలోచనలు భవిష్యత్తు పద్ధతులను తెలియజేస్తాయని, సమ్మిళిత, డేటా-ఆధారిత, స్థిరమైన పాలన చట్రాలను పెంపొందిస్తాయని కేఎస్ పీపీ విద్యార్థులు భావిస్తున్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

2 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

2 weeks ago