మనవార్తలు,హైదరాబాద్:
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్ఠాత్మకంగా “అంతర్జాతీయ కవితల పోటీలు” నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన, ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న కవయిత్రి శ్రీమతి మంజీత కుమార్ ఎంపికయ్యారు. ఏప్రిల్ 22, 23, 24 తేదీలలో జూమ్ లో తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద శ్రీమతి మంజీత కుమార్ తమ కవితను వినిపించబోతున్నారు.
దేశానికి వెన్నుముక అయినటువంటి రైతులను అందరూ గుర్తించి గౌరవించాలని, వారే ‘భవిష్యత్ సారథులని’ శ్రీమతి మంజీత కుమార్ అక్షరార్చన చేసినటువంటి కవిత ఈ పోటీకి ఎంపికయింది.ఇంతటి విశేషమైన కార్యక్రమంలో తనను ఎంపిక చేసి, అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తెస్తున్నందుకు తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారికి,
తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి శ్రీమతి మంజీత కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు.
సులువైన చిరు పదాలతో, మనసుకు హత్తుకునేలా కవితలు రాసే శ్రీమతి మంజీత కుమార్ గారు గతంలో రెండుసార్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులను, వంశీ గ్లోబల్ అవార్డును సొంతం చేసుకున్నారు. హాస్య కవితలు, కథలు రాయడంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికి 200పైగా కవితలు, వంద వరకూ కథలు రాసారు. సాహిత్య కళానిధి బిరుదు, గాథా సృజన సంయమి పురస్కారం, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సేవా పురస్కారం, అక్షర క్రాంతి పురస్కారంతోపాటు పలు సాహితీ సంస్థల నుంచి పురస్కారాలు, ప్రశంసా పత్రాలు, సన్మానాలు అందుకున్నారు. ఎన్నో వార్త పత్రికలు, వార మాస పత్రికలలో వీరి రచనలు ప్రచురితం అయ్యాయి. పలు రేడియోలు, యూట్యూబ్ ఛానెల్స్ లో వీరి కథలు, కవితలను చదివి వినిపించారు.
శ్రీమతి మంజీత కుమార్ వృత్తి రీత్యా పలు తెలుగు టీవి ఛానెల్స్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేసారు. దశాబ్ద కాలంపాటు ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్, రేడియో జాకీగా చేసారు. ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్స్ కి కథలు, మాటలు అందిస్తున్నారు. ఈక్షణం. కామ్ వెబ్సైటులో ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…