Hyderabad

దుర్గా నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించండి సర్పంచ్ కు  వినతిపత్రం

అమీన్పూర్

దుర్గా నగర్ కాలనీ లో మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని దుర్గ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్పంచ్ ఏర్పుల కృష్ణ. పంచాయతీ కార్యదర్శి వెంకట్ లకు ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మండలంలోని కిష్టారెడ్డిపేట దుర్గా నగర్ కాలనీ లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ ద్వీపాలు సరిగ్గా లేకపోవడం.కాలనీ ప్రజలందరికీ ఇబ్బందికరంగా మారిందన్నారు. అలాగే వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పుడు రోడ్ల వెంబడి గుంతల్లో నీళ్లు నిలిచి పోతున్నాయని నిలిచిపోయిన నీళ్లు బయటకు వెళ్లడానికి కూడా వీలులేకుండా ఉండడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.

అదేవిధంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో సైతం కాలనీకి ఎవరు వచ్చి, ఏమీ చేయలేదని వాపోయారు.పంచాయతీ పాలకవర్గం. కార్యదర్శి స్పందించి కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుదుర్గ ప్రసాద్. సత్యం. రవీందర్ రెడ్డి. దిలీప్ కుమార్. రాకేష్. సంతోష్ కుమార్. శ్రావణ్ లతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago