ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి :
బీజేపీ మతతత్వ పార్టీ అంటూ విపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని ఏపీ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు . కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కేఆర్ మురహరి రెడ్డిని షేక్ బాజి , కర్నూలు మైనార్టీ మోర్చా అధ్యక్షులుహావిలిన్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు .ముస్లీం, క్రిస్టియన్ మైనారిటీలకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలుసుకోవాలన్నారు . కేంద్ర ప్రభుత్వం హిందూ ,ముస్లీంలనే తేడా లేకుండా అందరికి సమన్యాయం చేస్తుందన్నారు .ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజలంతా అన్నదమ్ముల్లా మెలుగుతారని ఇతర పార్టీల నేతలు హిందూ ,ముస్లీంల మధ్య చీలిక తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు . అనంతరం రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు షేక్ బాజీ ,జిల్లా అధ్యక్షుడు హావీలిన్ బాబు , మురహరిరెడ్డి మైనారిటీల అభివృద్ధి కోసం బీజేపీ తీసుకు వచ్చిన కార్యక్రమాల కరపత్రం విడుదల చేశారు .
ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు కిరణ్ కుమార్ , పట్టణ ప్రధాన కార్యదర్శి జేట్టెప్పా ,రాష్ట్ర మైనారిటీ మోర్చ ఉపాధ్యక్షుడు కరిముల్ల ,జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ వర్మ , జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ ,జిల్లా మైనారిటీ మౌర్చ ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…