ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి :
బీజేపీ మతతత్వ పార్టీ అంటూ విపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని ఏపీ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు . కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కేఆర్ మురహరి రెడ్డిని షేక్ బాజి , కర్నూలు మైనార్టీ మోర్చా అధ్యక్షులుహావిలిన్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు .ముస్లీం, క్రిస్టియన్ మైనారిటీలకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలుసుకోవాలన్నారు . కేంద్ర ప్రభుత్వం హిందూ ,ముస్లీంలనే తేడా లేకుండా అందరికి సమన్యాయం చేస్తుందన్నారు .ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజలంతా అన్నదమ్ముల్లా మెలుగుతారని ఇతర పార్టీల నేతలు హిందూ ,ముస్లీంల మధ్య చీలిక తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు . అనంతరం రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు షేక్ బాజీ ,జిల్లా అధ్యక్షుడు హావీలిన్ బాబు , మురహరిరెడ్డి మైనారిటీల అభివృద్ధి కోసం బీజేపీ తీసుకు వచ్చిన కార్యక్రమాల కరపత్రం విడుదల చేశారు .
ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు కిరణ్ కుమార్ , పట్టణ ప్రధాన కార్యదర్శి జేట్టెప్పా ,రాష్ట్ర మైనారిటీ మోర్చ ఉపాధ్యక్షుడు కరిముల్ల ,జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ వర్మ , జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ ,జిల్లా మైనారిటీ మౌర్చ ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…