పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించి అమ్మ వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో జరిగే ఉత్సవాలు,ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తి భావం పెరుగుతుందన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు,ఈ కార్యక్రమంలో నెల్లి రాజు,జంగిటి మోహన్,ఆకుల రాజు,కాశం శ్రీనివాస్,దాకం యాదగిరి,కాశం మల్లేశం,రాము, గ్రామ పెద్దలు, ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు, ఎన్,ఎం,ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…