పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించి అమ్మ వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో జరిగే ఉత్సవాలు,ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తి భావం పెరుగుతుందన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు,ఈ కార్యక్రమంలో నెల్లి రాజు,జంగిటి మోహన్,ఆకుల రాజు,కాశం శ్రీనివాస్,దాకం యాదగిరి,కాశం మల్లేశం,రాము, గ్రామ పెద్దలు, ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు, ఎన్,ఎం,ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…