Telangana

ఆన్ లైన్ లో ప్రావిడెంట్ ఫండ్ సేవలు: కమిషనర్ విశాల్ అగర్వాల్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భవిష్య నిధి (ప్రావిడెంట్ ఫండ్ )కి సంబంధించిన ఏ సేవలైన నేరుగా ఆన్ లైన్ లోనే పొందవచ్చని, మొబైల్ మీట నొక్కితే చాలని, ప్రత్యేకించి పీఎఫ్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని పటాన్‌చెరు ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ విశాల్ అగర్వాల్ అన్నారు. ‘నిధి ఆప్కే నిఖత్ 2.0’ (ప్రజల వద్దనే సమస్యల పరిష్కారం) లో భాగంగా, మంగళవారం పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ తో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి ఎ. సిద్దిరాజు, అకౌంట్స్ అధికారి బి.మనోజ్, ఇతర సిబ్బందితో కలిసి గీతం అధ్యాపకులు, సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు. ఫిర్యాదుల పరిష్కారం, సమాచార మార్పిడి, అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు విశాల్ అగర్వాల్ తెలిపారు. భవిష్య నిధి సభ్యులు తను పీఎఫ్ అకౌంట్ ను ఆధార్, పాన్ కార్డులతో అనుసంధానం చేసుకుంటే, ఆన్ లైన్ లో ఎంత మొత్తం నిల్వ ఉంది, నెలవారీ పీఎఫ్ జమ , ఇ-నామినేషన్ వంటి పనులన్నింటినీ మొబైల్ ఫోన్ తోనే చేసుకోవచ్చని, పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టీకరించారు.

”ప్రయాస్’ పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు రిటైర్ అయిన రోజే పెన్షన్ పొందే వీలు కల్పిస్తున్నానని, తమకు వచ్చే దరఖాస్తులను రెండు మూడు రోజులలోనే పరిష్కరిస్తున్నట్టు విశాల్ అగర్వాల్ తెలిపారు. గత ఏడాది జనవరి నుంచి ప్రతినెలా 27న ‘నిధి ఆప్కే నిఖత్ పేరిట దేశవ్యాప్తంగా పీఎఫ్ సేనలను ఉద్యోగుల పని ప్రదేశాల్లోనే అందుబాటులోకి తెచ్చి, వారి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. విస్తృతమైన ప్రజల భాగస్వామ్యంతో, వారు సంతృప్తి సాందేలా పీఎఫ్ సేవలను సమర్ధవంతంగా అందజేస్తున్నట్టు తెలియజేశారు.ఈ సందర్భంగా, ఆన్ లైన్ క్లెయిమ్ లను దాఖలు చేయడం, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం వంటి ఆన్ లైన్ సేవలను అవ సరార్థులకు అందించడానికి హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. తద్వారా ఈపీఎఫ్ అధికారులు, ఉద్యోగులతో పరస్పర చర్చకు, అవగాహన పెంపొందించడానికి, అనుమానాల నివృత్తి చేసుకోవడంతో పాటు పీఎఫ్ సేవలు సులువుగా పొందే వీలు కలిగింది.గీతం రెసిడెంట్ డైరక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలువురు అధ్యాపకులు, సిబ్బంది, సహ సిబ్బంది తదితరులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన కొందరు ఉద్యోగులకు పెన్షన్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago