Districts

ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో నారాయణఖేడ్ సభకు తరలి వెళ్లిన పటాన్చెరు టిఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు , పటాన్ చెరు:

నేటి మధ్యాహ్నం నారాయణఖేడ్ లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగసభకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలోని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ కాన్వాయ్ గా బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేల వేల మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి సభకు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.

 

కెసిఆర్ సభకు తరలి వెళ్లిన పటాన్చెరు టిఆర్ఎస్ మహిళా శ్రేణులు

నేడు నారాయణఖేడ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా జరగనున్న భారీ బహిరంగ సభకు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి నాయకత్వంలో రెండు వేల మంది మహిళలు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా యాదమ్మ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి అనునిత్యం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్చెరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకు వెళుతోంది అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, జెడ్ పి టి సి లు సుప్రజ వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు రోజా బాల్ రెడ్డి, లలితా సోమిరెడ్డి, ఎంపీటీసీ నీన చంద్రశేఖర్ రెడ్డి, మాధవి, అరుంధతి, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago