Telangana

తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి, చిట్కుల్, ఇస్నాపూర్ గ్రామాల పరిధిలో తాగునీటి సరఫరా అంశంలో నెలకొన్న ఇబ్బందులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి.. ప్రజలకు మంచినీటిని అందించాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ ఉన్నత అధికారులు, మున్సిపల్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ముత్తంగి, ఇస్నాపూర్ గ్రామాల పరిధిలో చేపడుతున్న పనుల మూలంగా తాగునీటి పైప్లైన్లు పగిలిపోవడం మూలంగా ప్రజలకు మంచినీటి సరఫరా అంశంలో ఇబ్బందులు తలెత్తయని అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు.వేసవి కాలం కావడంతో ప్రజలు మంచినీటి అంశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సరఫరాను ప్రారంభించాలని ఆదేశించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో నూతన మంచినీటి ట్యాంకుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ స్థానిక అధికారులు ప్రతిరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని కోరారు. రామేశ్వరం బండ గ్రామ పరిధిలోని వీకర్ సెక్షన్, ఇంద్రపురి కాలనీలలో జనాభాకు అనుగుణంగా మంచినీరు రావడంలేదని.. వెంటనే సరఫరాను పెంచాలని ఆదేశించారు. దీంతోపాటు ఇంద్రేశం సత్యసాయి వాటర్ పంప్ హౌస్ సమీపంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. ఈ సమావేశంలో తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, మిషన్ భగీరథ ఎస్ ఇ రఘువీర్, ఈ ఈ విజయలక్ష్మి, డిఈలు సుచరిత, శ్రీనివాస్, మున్సిపల్ ఏఈ మౌనిక, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

53 minutes ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

60 minutes ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago