Telangana

తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి, చిట్కుల్, ఇస్నాపూర్ గ్రామాల పరిధిలో తాగునీటి సరఫరా అంశంలో నెలకొన్న ఇబ్బందులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి.. ప్రజలకు మంచినీటిని అందించాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ ఉన్నత అధికారులు, మున్సిపల్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ముత్తంగి, ఇస్నాపూర్ గ్రామాల పరిధిలో చేపడుతున్న పనుల మూలంగా తాగునీటి పైప్లైన్లు పగిలిపోవడం మూలంగా ప్రజలకు మంచినీటి సరఫరా అంశంలో ఇబ్బందులు తలెత్తయని అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు.వేసవి కాలం కావడంతో ప్రజలు మంచినీటి అంశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సరఫరాను ప్రారంభించాలని ఆదేశించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో నూతన మంచినీటి ట్యాంకుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ స్థానిక అధికారులు ప్రతిరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని కోరారు. రామేశ్వరం బండ గ్రామ పరిధిలోని వీకర్ సెక్షన్, ఇంద్రపురి కాలనీలలో జనాభాకు అనుగుణంగా మంచినీరు రావడంలేదని.. వెంటనే సరఫరాను పెంచాలని ఆదేశించారు. దీంతోపాటు ఇంద్రేశం సత్యసాయి వాటర్ పంప్ హౌస్ సమీపంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. ఈ సమావేశంలో తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, మిషన్ భగీరథ ఎస్ ఇ రఘువీర్, ఈ ఈ విజయలక్ష్మి, డిఈలు సుచరిత, శ్రీనివాస్, మున్సిపల్ ఏఈ మౌనిక, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago