Telangana

పటాన్‌చెరులో 12 కోట్ల రూపాయలతో ఇండోర్ సబ్ స్టేషన్

నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పెరుగుతున్న జనాభాకు అణుగుణంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ కేంద్రమైన పటాన్‌చెరు పట్టణంలో 12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33/11 కెవి ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో 12 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన 33/11 కెవి ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పటాన్చెరువు పట్టణంలో ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. పాశమైలారం నుండి నేరుగా నూతన సబ్ స్టేషన్ కి ప్రత్యేక లైను వేయడంతో పాటు పటాన్‌చెరున్చెరు, రామచంద్రాపురం పట్టణాలకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్ లో 100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 132 కెవి సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు ఎంపీడీవో యాదగిరి, విద్యుత్ శాఖ ADE లు సంజీవ్, నాగరాజు, రవికాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నివర్తి దేవ్, అంతిరెడ్డి, అంజిరెడ్డి, గోపాల్ రెడ్డి, షకీల్, ఐలేష్, హమీద్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago