పటాన్ చెరు శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు
శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని ఈనెల 25 తేదీ నుండి 29వ తేదీ వరకు పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆదివారం ఉదయం దేవాలయం ఆవరణలో పటాన్ చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రజలు, భక్తుల సహకారంతో ప్రతి ఏటా ఐదు రోజుల పాటు వేద మంత్రోచ్ఛరణాల మధ్య భక్తుల జయ జయ ధ్వనాలతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 27వ తేదీన వేలాది మంది భక్తుల సమక్షంలో అభిజిత్ లగ్న సుముహూర్తమున శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించబోతున్నట్లు తెలిపారు.ఐదు రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు భక్తులందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాలను దిగ్విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారుఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అర్చక స్వామి నరసింహచార్యులు, సీనియర్ నాయకులు కుమార్ యాదవ్, పృథ్వీరాజ్, అశోక్, వెంకటేష్, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…