_6 లక్షల రూపాయల సొంత నిధులచే గ్రామైక్య సంఘం సహాయకులకు ఏకరూప దుస్తులు, ఐడి కార్డుల పంపిణీ
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గ్రామస్థాయిలో మహిళా సంఘాల బలోపేతంలో కీలక భూమిక పోషిస్తున్న గ్రామైక్య సంఘం సహాయకులు (వివో ఏ) లకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేయూతను అందించారు. నియోజకవర్గ పరిధిలోని జిహెచ్ఎంసి, మున్సిపాలిటీ, గ్రామాలలో పనిచేస్తున్న 200 మంది వివోఏ లకు 6 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన రెండు జతల ఏకరూప దుస్తులు, ఐడెంటి కార్డులను అందించారు. గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరువు మండల పరిధిలో పనిచేస్తున్న విఏవోలకు వీటిని అందజేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పోరేటర్ పుష్ప నగర్, ఐకెపి ఎపిఎం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…