పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
రాబోయే వర్షాకాలంలో అత్యవసర సమయంలో సేవలు అందించేందుకు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అత్యవసర సహాయక బృందాలను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయం ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు 24 గంటల పాటు సహాయక బృందాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. భారీ వర్షాలు కురిసినప్పుడు మురుగునీటి కాలువలు, నాళాలు పొంగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. భారతి నగర్, రామచంద్రపురం, పటాన్చెరు డివిజన్ల పరిధిలో ఒక్కో బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…