Districts

క్రీడల కేంద్రంగా పటాన్చెరు నియోజకవర్గం_చదువుతో పాటు క్రీడలు ప్రధానమే మత్తుకు బానిస కావొద్దు

మనవార్తలు ,పటాన్చెరు

పటాన్చెరు నియోజకవర్గాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. యువత చదువుతోపాటు క్రీడల్లోను నైపుణ్యం సాధించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తుకు బానిస కావద్దని సూచించారు నూతన సంవత్సరం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు పట్టణానికి మైత్రి క్రీడామైదానం తలమానికంగా మారబోతుందనీ అన్నారు. ఈనెల 26వ తేదీ లోపు మైదానాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక నుండి వివిధ క్రీడాంశాల్లో ప్రతి రెండు నెలలకు ఒకసారి జిల్లా, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గం నుండి మెరుగైన క్రీడాకారులను తీర్చిదిద్ది, జాతీయ స్థాయికి పంపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. స్వతహాగా క్రీడాకారుడు అయిన తాను క్రీడా రంగం అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

ఇటీవల యువత మత్తుకు బానిస కావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని యువత ఎవరు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం టోర్నమెంట్ విజేతగా నిలిచిన కేబీఎన్ టీమ్, రన్నరప్ గా నిలిచిన నిరంజన్ ఎలెవన్ జట్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ పట్టణ అద్యక్షులు అఫ్జల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, శ్రీధర్ చారి, వెంకటేష్, మైత్రి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు హన్మంత్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago