పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
మన దేశ చరిత్రలో వందేళ్లుగా గుర్తింపు ఉన్నవాడు చత్రపతి సాహు మహారాజ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని పటాన్చెరువు బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు శ్రీశైలం ఆన్నారు.చత్రపతి సాహు మహారాజ్ జయంతిని పురస్కరించుకొని రామచంద్రాపురంలో ని అంబేద్కర్ విగ్రహం దగ్గర చత్రపతి సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పటాన్చెరువు బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ చత్రపతి శివాజీ వారసుడిగా కృషిచేసి ప్రజాస్వామిక తాత్విక పునాది ఏర్పరిచి ప్రజలకు రారాజుగా మిగిలిపోయిన మహనీయుడని వెనుకబడిన కులంలో పుట్టి సామాజిక ఉద్యమకారుడు అయ్యాడని కేవలం మహారాష్ట్ర కే కాకుండా దక్షిణ భారతంలో జస్టిస్ పార్టీ ఉద్యమంతో పాటు దేశం మొత్తం మీద ప్రభావం చూపిన సాహూ మహారాజ్ ఒక్కడే అని అన్నారు.ఛత్రపతి సాహు మహరాజ్ స్పూర్తితో బీసీలకు చట్ట సభల్లో 60 నుండి 70 సీట్ల వరకు ప్రాతినిధ్యం కల్పించబోయే పార్టీ కేవలం బీఎస్పీ మాత్రమే అని శ్రీశైలం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి సంజీవ్, వైస్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, జనరల్ సెక్రటరీ,ప్రశాంత్, రమేష్, నర్సింహా,ఇస్నాపుర్ సెక్టార్ నాయకులు షేక్ ఫరీద్, జనార్ధన్, యేసు, తెల్లాపూర్ సెక్టార్, సునీల్ పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…