Telangana

మరోసారి ఉదారతను చాటిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పుట్టిన పిల్లలకు 20వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్

ముత్తంగిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

తెల్లాపూర్ జిహెచ్ఎంసీ సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనేత లోకసభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ముత్తంగి డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా, సేవా కార్యక్రమాలతో మిన్నంటాయి. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించారు. కేవలం కేక్ కటింగ్స్, హంగామా వంటి ఆడంబరాలకు పోకుండా, సమాజంలోని అట్టడుగు వర్గాలకు, నిరుపేదలకు అండగా నిలిచేలా పలు వినూత్న సేవా కార్యక్రమాలను చేపట్టడం ఈ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని నీలం మధు ముదిరాజ్ తన అపారమైన ఉదారతను చాటుకుంటూ పసికందుల భవిష్యత్తుకు భరోసా కల్పించారు. పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు జన్మించిన పసికందులకు వారి భవిష్యత్తు భద్రత కొరకు ప్రతి సంవత్సరం లాగే ఈ సారికూడా తలా 20 వేల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చెక్కు లను అందజేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ప్రసవాలు చేసుకునే నిరుపేద కుటుంబాలకు ఈ సాయం కొండంత అండగా నిలిచింది.

అదేవిధంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అహర్నిశలు శ్రమిస్తున్న జీహెచ్ఎంసీ సఫాయి కార్మికులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అనంతరం వారి కుటుంబాలకు అవసరమైన నిత్యవసర వస్తువుల కిట్లను నీలం మధు ముదిరాజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సమాజ సేవలో భాగస్వాములవుతున్న కార్మికులను గౌరవించుకోవడం మన అందరి బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలో ద్వేషాన్ని తొలగించి, ప్రేమాభిమానాలను నింపడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ గారు ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టారని, ఆయన ఆశయాలు, త్యాగాలు దేశ యువతకు ఎంతో ఆదర్శమని కొనియాడారు. దేశ రక్షణే ధ్యేయంగా, పేదల గొంతుకగా ఆయన నిరంతరం పోరాడుతున్నారని  తెలిపారు.

రాహుల్ గాంధీ పుట్టినరోజున పేద ప్రజలకు, కార్మికులకు సేవ చేయడం ద్వారా ఆయనకు నిజమైన జన్మదిన కానుక ఇస్తున్నామని, పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన పసికందుల భవిష్యత్తుకు చిన్న సాయం అందించడం, అలాగే ఎండనక వాననక కష్టపడే మన జీహెచ్ఎంసీ కార్మికులను ఆదుకోవడం తమకు దక్కిన అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజల పక్షాన నిలబడి మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నీలం మధు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, సంగన్నగారి గోపాల్, నరసింహ రెడ్డి, వెంకటేష్ నాయక్, రాఘవేంద్ర, నారాయణదాసు, సంపత్ రెడ్డి, మణికంఠ, సందీప్ గౌడ్, జిల్లా ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు కోల్కూరి నరసింహారెడ్డి, అశోక్ ముదిరాజ్, మధు పంతులు, గడ్డ యాదయ్య, గుండ్ల మహేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి,గోపాలకృష్ణ, సందీప్ యాదవ్, దశరథ్,ప్రవీణ్, విఠల్, రంజిత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున్న పాల్గొనారు..

admin

Recent Posts

సీసీ కెమెరాలు ఏర్పాటుతోనే శాంతిభద్రతలు డీసీపీ చింతమనేని శ్రీనివాస్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సిసి కెమెరాలు ఏర్పాటుతో శాంతి భద్రతలు లభిస్తాయని లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.…

13 hours ago

కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న బిస్లరీ యాజమాన్యం

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి,శాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనోహర్ బిస్లరీ కార్మికులకు అండగా జిల్లా కార్మిక వర్గం…

14 hours ago

విద్యార్థుల ఆత్మబంధువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారి..438 మంది 10వ తరగతి ప్రతిభావంతులకు సైకిళ్ల పంపిణీ. 35 లక్షల రూపాయల సొంత నిధులతో…

14 hours ago

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం: పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పటాన్‌చెరు…

2 days ago

పెండింగ్ లో ఉన్న భూసర్వే సమస్యలు వెంటనే పరిష్కరించాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్ చెరు మండలంలో పెండింగ్ లో ఉన్న భూ సర్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలని…

2 days ago

గీతంలో అజ్ఞాత వీరులకు సన్మానం

ఆనందోత్సాహాల మధ్య ఉత్సాహంగా ముగిసిన ముదిత 4.0 వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సురక్షితమైన, ఆహ్వానించదగిన, సుసంపన్నమైన ప్రాంగణ…

2 days ago