మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
సిసి కెమెరాలు ఏర్పాటుతో శాంతి భద్రతలు లభిస్తాయని లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో మహీధర లగ్జూరియా విల్లాస్ యాజమాన్యం మహీధర లగ్జూరియా విల్లాస్ 3 జోన్స్ కి 50 సీసీ కెమెరాలు స్వర్ణాక్షి డెవలపర్స్ అధినేత జి విజయ సాగర్, జి. సాయి కిరణ్, స్థానికులు కిషోర్ రెడ్డిల సహకారంతో ఏర్పాటు చేయగా వాటిని డిసిపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు అవుతున్న అన్ని వెంచర్లలను విలువగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల తగ్గుదలకు అవకాశం తో పాటు నేరాలు జరిగిన సందర్భాలలో నిందితులను వేగంగా గుర్తించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ కోట్లు పెట్టి ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటుకు శ్రద్ధ చూపకపోవడం దురదృష్టకరమని ఇంటికి తాళం కంటే సిసి కెమెరా విలువ ఎక్కువ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ వినాయక రెడ్డి, ఎస్సై ఆసిఫ్ ఆలీ
స్థానిక నాయకులు స్వాతి రెడ్డి, రమ్య, నవీన్ బొల్ల, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
…….
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి,శాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనోహర్ బిస్లరీ కార్మికులకు అండగా జిల్లా కార్మిక వర్గం…
పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారి..438 మంది 10వ తరగతి ప్రతిభావంతులకు సైకిళ్ల పంపిణీ. 35 లక్షల రూపాయల సొంత నిధులతో…
రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పుట్టిన పిల్లలకు 20వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ముత్తంగిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన…
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్ చెరు మండలంలో పెండింగ్ లో ఉన్న భూ సర్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలని…
ఆనందోత్సాహాల మధ్య ఉత్సాహంగా ముగిసిన ముదిత 4.0 వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సురక్షితమైన, ఆహ్వానించదగిన, సుసంపన్నమైన ప్రాంగణ…