Telangana

నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ’

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే నిరంతర అభ్యాసం ఆవశ్యమని, అప్పుడే కొత్త నైపుణ్యాలు, జ్ఞానం అలవడతాయని క్యాఫ్రికాల్ టెక్నాలజీస్, ప్రొడక్ట్ మేనేజర్ ప్రేమ్ కుమార్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో మెషిన్ లెర్నింగ్ – ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది.ఇందులో ప్రధాన వక్తగా పాల్గొంటున్న ఆయన మాట్లాడుతూ,అందుబాటులో సాంకేతికపరిజ్ఞానంఆరు నెలల్లో మారిపోతోందని, కొన్నిసార్లు పూర్తిగా కొత్తదనం సంతరించుకుంటోందన్నారు. తాను బీటెక్ పట్టానిఇంజనీరింగ్ లేదా విద్యా ప్రారంభంగానే భావించానని, ఎందుకంటే, ఐదేళ్లకోసారి కొత్త సాంకేతిక వస్తోందని, దానినిఅది నుంచి నేర్చుకోకపోతే విద్యార్థుల ముందు నిలబడడం కష్టమవుతుందని ఆయన స్పష్టీకరించారు.

చాలానుంది విద్యార్థులు సాంకేతికతతో ప్రేరేపితులవున్నారని, అయితే దానిని ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియదన్నారు. కొత్త పరిజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించే ముందు, అధ్యాసకులంతా దాని ప్రాథమిక పరిజ్ఞానాన్ని పూర్తిగా అలవరచుకోవాలని, అప్పుడే సరైన బోధన, ప్రాజెక్టులను చేపట్టగలమని ఆయన ఉద్ఘాటించారు. రోబోటిక్ పరిజ్ఞానంతో రూపొందించిన టిక్ టాక్ -టో గేనును మంగళవారం సదస్యుల ముందు ప్రదర్శిస్తారని ప్రేమ్ హామీ ఇచ్చారు.

తొలుత, గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య మాట్లాడుతూ, ఈ మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని నూతన జ్ఞానాన్ని పొందాలని, కొత్త వెపుణ్యాలను అలవరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమ లక్ష్యాలను ఈతసీత విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి వివరించగా, కార్యక్రమ నిర్వాహకుడు ప్రొఫెసర్ కె. మంజునాథాచారి వందన సమర్పణతో ప్రారంభోత్సవం. ముగిసింది. ఈ ఎన్డీపీ బుధవారం వరకు కొనసాగనుంది.

admin

Recent Posts

సీసీ కెమెరాలు ఏర్పాటుతోనే శాంతిభద్రతలు డీసీపీ చింతమనేని శ్రీనివాస్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సిసి కెమెరాలు ఏర్పాటుతో శాంతి భద్రతలు లభిస్తాయని లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.…

22 hours ago

కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న బిస్లరీ యాజమాన్యం

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి,శాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనోహర్ బిస్లరీ కార్మికులకు అండగా జిల్లా కార్మిక వర్గం…

23 hours ago

విద్యార్థుల ఆత్మబంధువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారి..438 మంది 10వ తరగతి ప్రతిభావంతులకు సైకిళ్ల పంపిణీ. 35 లక్షల రూపాయల సొంత నిధులతో…

23 hours ago

మరోసారి ఉదారతను చాటిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పుట్టిన పిల్లలకు 20వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ముత్తంగిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన…

2 days ago

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం: పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పటాన్‌చెరు…

2 days ago

పెండింగ్ లో ఉన్న భూసర్వే సమస్యలు వెంటనే పరిష్కరించాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్ చెరు మండలంలో పెండింగ్ లో ఉన్న భూ సర్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలని…

2 days ago