Telangana

పటాన్ చెరు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బరిలో దండ్ల కిరణ్ కుమార్

-తొలిసారిగా ఆన్ లైన్ లో ఓటింగ్ ప్రక్రియ

-‘హస్తం’ పార్టీకి క్షేత్రస్థాయిలో వెన్నుదన్నుగా యువజన కాంగ్రెస్

-పటాన్ చెరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీలో దండ్ల కిరణ్ కుమార్

-తమ అమూల్యమైన ఓటు ఆన్ లైన్ పద్ధతి ద్వారా వేసి గెలిపించాలని అభ్యర్థన

-కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నా గెలుపుకు సహకరించండి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల సందడి నెలకొంది. బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.ఆన్ లైన్ ఓటింగ్ కావడంతో కార్యకర్తల మద్దతు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించనున్నారు.ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. హస్తం”పార్టీకి క్షేత్రస్థాయిలో వెన్నుదన్నుగా యువజన కాంగ్రెస్ నిలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అధిష్టానం యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటివరకు ఆ విభాగం ఎన్నికలకు బ్యాలెట్ విధానంలో నిర్వహించగా తొలిసారి ఆన్ లైన్ ద్వారా చేపడుతున్నారు.మండల స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుడి వరకు ఈ ప్రక్రియనే కొనసాగనుంది. నామినేషన్ దాఖలు నుంచి ఫలితాల వెల్లడి వరకు పూర్తిగా ఆన్ లైన్ విధానంలోనే చేపట్టనున్నారు. పటాన్ చెరు నియోజకవర్గ అధ్యక్ష బరిలో దండ్ల కిరణ్ కుమార్ ఉండనున్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అమూల్యమైన ఓటు ఆన్ లైన్ పద్ధతి ద్వారా వేయాలని దండ్ల కిరణ్ కుమార్ విన్నవించుకున్నారు.తమ గెలుపులో భాగస్వామ్యం కావాలని కోరారు.

అంతా ఆన్ లైన్ లోనే

ఆన్ లైన్ ఎన్నికల నిర్వహణ కోసం”విత్ ఐవైసి”అనే ప్రత్యేక యాప్ ను ఉపయోగిస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ ఆన్ లైన్ పద్ధతిలో ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.బరిలో నిలిచిన అభ్యర్థి దండ్ల కిరణ్ కుమార్ పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ ఎంపీ కంటెస్టింగ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ఆశీస్సులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువత మద్దతును కూడగట్టుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.పోటీలో పాల్గొనొన్న అభ్యర్థి దండ్ల కిరణ్ కుమార్ గతంలో కృష్ణారెడ్డి పెట్ విలేజ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా,అమీన్ పూర్ మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోరుకునే తనను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు దండ కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

admin

Recent Posts

గీతంలో క్వాంటం సాంకేతికపై పరిశోధన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…

2 days ago

నిజాయితీ, నిబద్ధత కలిగిన నిస్వార్థ నాయకుడు స్వర్గీయ జి. ఎల్లన్న: మాజీ మంత్రి హరీశ్ రావు

తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…

2 days ago

రఘునాథ్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…

4 days ago

గీతంలో ముగిసిన భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…

4 days ago

కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం నుండి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టండి

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

4 days ago

డిఆర్డిఏ, మెప్మ, రెవెన్యూ, ఎక్సైజ్, హెచ్ఎండిఎ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష

మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…

4 days ago