Telangana

పి.ఎల్.మాధురికి కెమిస్ట్రీలో పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని పి.ఎల్.మాధురి డాక్టరేట్ కు అర్హత సాధించారు. గోధుమ గడ్డి ఆకులను సహజ క్షయకరణ, క్యాపింగ్ ఏజెంట్ గా ఉపయోగించి మెటల్ ఆక్సైడ్ నానోకంపోజిట్లను సంశ్లేషణ ద్వారా నీటి కాలుష్య నివారణకు పర్యావరణ అనుకూల విధానాన్ని అన్వేషించడంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.ఫణి రాజా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ మాధురి చేసిన అత్యుత్తమ పరిశోధన స్థిరమైన శాస్త్రం, పర్యావరణ కాలుష్య నివారణకు గణనీయమైన సహకారాన్ని అందిస్తుందన్నారు. ఈ పర్యావరణ అనుకూల పద్ధతి ఫోటోకాటలిటిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో జింక్ ఆక్సైడ్-కార్బన్, కాపర్ ఆక్సైడ్, మాగ్నెటైట్-కార్బన్, నికెల్ ఆక్సైడ్ వంటి నానోకంపోజిట్లను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. నీటి శుద్ధి కోసం తక్కువ వ్యయంతో కూడిన, సమర్థవంతమైన నానోమెటీరియల్స్ అభివృద్ధి చేయడానికి సేంద్రీయ వ్యవసాయ వ్యర్థాలను ఎలా సమర్థంగా ఉపయోగించవచ్చో ఈ అధ్యయనం వెల్లడిస్తుందన్నారు.డాక్టర్ మాధురి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.పరివర్తనాత్మక విద్యా ప్రయత్నాల ద్వారా పరిశోధన నైపుణ్యం, ఆవిష్కరణలను పెంపొందించే లక్ష్యంతో గీతం ముందుకు సాగుతోందని తెలియజేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago