కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి గడ్కరీ కి విన్నవించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పటాన్చెరు పట్టణంలో వ్యాపారస్తులకు, స్థానికులకు నష్టం వాటిల్లకుండా ఫ్లై ఓవర్ నిర్మించాలని కోరుతూ కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి వినతిపత్రం అందించారు. బిహెచ్ఇఎల్ వద్దా 136 కోట్లతో నూతనంగా నిర్మించిన బీహెచ్ఈఎల్ – లింగంపల్లి నూతన ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ నీ ఎమ్మెల్యే జిఎంఆర్ కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి విస్తరణమూలంగా పటాన్చెరు పట్టణంలో ఎదురయ్యే ఇబ్బందులను వినతి పత్రంలో కేంద్ర మంత్రికి అందించారు. ప్రధానంగా విస్తరణ మూలంగా పటాన్చెరువు పట్టణంలో వ్యాపార సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన వ్యాపార కేంద్రాలతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం విస్తరణ మూలంగా కూల్చివేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. సానుకూలంగా స్పందించే సమస్యను పరిష్కరించాలని కోరారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…