కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి గడ్కరీ కి విన్నవించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పటాన్చెరు పట్టణంలో వ్యాపారస్తులకు, స్థానికులకు నష్టం వాటిల్లకుండా ఫ్లై ఓవర్ నిర్మించాలని కోరుతూ కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి వినతిపత్రం అందించారు. బిహెచ్ఇఎల్ వద్దా 136 కోట్లతో నూతనంగా నిర్మించిన బీహెచ్ఈఎల్ – లింగంపల్లి నూతన ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ నీ ఎమ్మెల్యే జిఎంఆర్ కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి విస్తరణమూలంగా పటాన్చెరు పట్టణంలో ఎదురయ్యే ఇబ్బందులను వినతి పత్రంలో కేంద్ర మంత్రికి అందించారు. ప్రధానంగా విస్తరణ మూలంగా పటాన్చెరువు పట్టణంలో వ్యాపార సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన వ్యాపార కేంద్రాలతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం విస్తరణ మూలంగా కూల్చివేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. సానుకూలంగా స్పందించే సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…