Districts

హైదరాబాద్ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహానికి లక్ష రూపాయల విరాళం

మనవార్తలు, పటాన్ చెరు :

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్నటువంటి హైదరాబాద్ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపన కోసం లక్ష రూపాయల విరాళం అందించిన పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు .సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నాగేష్ ముదిరాజ్ నిర్మిస్తున్నటువంటి  కాంస్య విగ్రహం కోసం తన వంతు విరాళంగా లక్ష రూపాయల నగదు తన కార్యాలయంలో అందజేసారు.

అనంతరం దేవేందర్ రాజు మాట్లాడుతూ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామిహైదరాబాద్ కు తోలి డిప్యుటి మేయర్‌గా 1955లో ఎన్నికయ్యారు. ఈ హోదాలో అనేక కమిటీలకు సహాదారుగా పని చేశాడు. 1957లో మేయర్‌గాఎన్నికైనారు. కృష్ణస్వామి స్వాతంత్య్రానంతర హైద్రాబాద్‌కు మొదటి మేయర్‌ గా పని చేశారు. 1957లో హైదరాబాద్‌ నాలుగో మేయర్‌గా ఎన్నికైన తర్వాత రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగరాభివృద్ధి కోసం మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసిన దీర్ఘ దృష్టి ఆయనది.

అని సంపాదన పై ఆశ లేక, ప్రజాసేవే పరమార్థంగా, ఉన్న ఇల్లును కూడా అమ్ముకొని ప్రజా జీవితంలో మచ్చలేని జీవితం గడిపాడు అని మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు అన్నారు ఈ కార్యక్రమంలో పటేల్ గూడా ఉపసర్పంచ్ జానకి జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగేష్ ముదిరాజ్, యాదగిరి ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, వేణుగోపాల్ ముదిరాజ్, జిన్నారం మండల మాజీ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు భవాని రమేష్, ముదిరాజ్, మోత కృష్ణ ముదిరాజ్, బిక్షపతి ముదిరాజ్, రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago