Telangana

అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిన ఓల్డ్ ఎం ఐ జి

_కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

ఎట్టి పరిస్థితులోను అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేదే లేదంటూ ప్రభుత్వం ఎన్నో జీవో లు తీసుకొచ్చింది. ప్రభుత్వాదాయానికి గండి పడనియకుండా అడ్డుకట్టవేయాలని ఎన్నో ప్రత్నాలు చేస్తుంది.. కానీ కిందిస్థాయి అధికారులు దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భేల్ ఉద్యోగులు నీతిగల వారు, సక్రమంగా అనుమతులు తీసుకొని నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా వారి మధ్యలో బిల్డర్లరనే రాబందులు దూరి అనుమతులను తుంగలో తొక్కి తమ ఇష్టాను తీరుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్ తోటి ప్రభుత్వ అధికారులకు సహకరించకపోతే ఇక బయటవాళ్ళు ఎలా సహకరిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భేల్ పాత ఎం ఐ జి కాలని ఇటు శేరిలింగంపల్లి, అటు ఆర్.సి పురం రెండు సర్కిళ్ల మద్ధ్యలో ఉంది. కొంతభాగం ఇటు మరి కొంత భాగం అటు వస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు మేనవేశాలు లెక్కించడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే కొందరు రాజకీయ నాయకులు వీరికి అండగా ఉండడం అక్రెమార్కులకు కల్సివస్తుంది. ఎమ్మెల్యే నో, కార్పొరేటరో, లేక మరో లీఫర్లొ ఇలా వారి పేర్లు చెప్పుకొని తమపని చక్కబెట్టుకుంటున్నారు. ఎం ఐ జి ప్లాట్ నెంబర్ 929, 643 ఎదురుగా, 642 పక్కన, 214 మరియు 204 మధ్యలో ఒకటి, 446, 469 ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. వీటిపై తక్షణమే చర్యలు చర్యలుతీసుకోవాలని కోరుతున్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago