స్థిరమైన మద్దతు, నిస్వార్థ నిబద్ధతకు గుర్తింపుగా అందజేసిన మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ఎన్టీఆర్ మెమెరియల్ ట్రస్టు చేపట్టిన కార్యక్రమాలకు హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అందిస్తున్న ఉదారమైన విరాళాలు, స్థిరమైన మద్దతుకు గుర్తింపుగా మంగళవారం ఒక జ్జాపికను, అవార్డును అందజేశారు. ఈ ప్రశంసా పత్రంలో గీతం యొక్క నిస్వార్థ నిబద్ధతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, నిరుపేదల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడంలో దాని ప్రయత్నాలు కీలక పాత్ర పోషించాయని, విస్తృత సమాజానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు.ఈ పురస్కారాన్ని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చేతుల మీదుగా గీతం హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మకు అందజేశారు.ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత నాలుగేళ్లగా గీతంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను చురుకుగా నిర్వహిస్తున్నారు. రక్తదానం యొక్క ప్రాణరక్షక ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, విద్యార్థులలో కరుణ, సామాజిక బాధ్యత, సేవా స్ఫూర్తిని పెంపొందిస్తున్నారు. ప్రాణాలను కాపాడటంలో సహాయపడి, ఇతరులను కూడా ఇటువంటి గొప్ప కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించే విద్యార్థుల ఉదారతను, నిస్వార్థ సహకారాన్ని నిర్వాహకులు ప్రశంసించడంతో ఈ కార్యక్రమానికి విస్తృత ప్రశంసలు లభించాయి.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, గీతం డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు తదితరులు ఈ అవార్డును అందుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు. ఇటువంటి ప్రభావవంతమైన సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…