Telangana

గీతంకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు అవార్డు

స్థిరమైన మద్దతు, నిస్వార్థ నిబద్ధతకు గుర్తింపుగా అందజేసిన మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఎన్టీఆర్ మెమెరియల్ ట్రస్టు చేపట్టిన కార్యక్రమాలకు హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అందిస్తున్న ఉదారమైన విరాళాలు, స్థిరమైన మద్దతుకు గుర్తింపుగా మంగళవారం ఒక జ్జాపికను, అవార్డును అందజేశారు. ఈ ప్రశంసా పత్రంలో గీతం యొక్క నిస్వార్థ నిబద్ధతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, నిరుపేదల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడంలో దాని ప్రయత్నాలు కీలక పాత్ర పోషించాయని, విస్తృత సమాజానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు.ఈ పురస్కారాన్ని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చేతుల మీదుగా గీతం హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మకు అందజేశారు.ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత నాలుగేళ్లగా గీతంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను చురుకుగా నిర్వహిస్తున్నారు. రక్తదానం యొక్క ప్రాణరక్షక ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, విద్యార్థులలో కరుణ, సామాజిక బాధ్యత, సేవా స్ఫూర్తిని పెంపొందిస్తున్నారు. ప్రాణాలను కాపాడటంలో సహాయపడి, ఇతరులను కూడా ఇటువంటి గొప్ప కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించే విద్యార్థుల ఉదారతను, నిస్వార్థ సహకారాన్ని నిర్వాహకులు ప్రశంసించడంతో ఈ కార్యక్రమానికి విస్తృత ప్రశంసలు లభించాయి.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, గీతం డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు తదితరులు ఈ అవార్డును అందుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు. ఇటువంటి ప్రభావవంతమైన సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

3 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago