సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లోని సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టు నిండు కుండల మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 11వ నెంబర్ గేటు ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని ఎమ్మెల్యే క్రాంతికిరన్ గారు ఇరిగేషన్ అధికారులతో కలిసి విడుదల చేశారు. ముందుగా గంగా పూజ చేసి తదనంతరం ఎమ్మెల్యే క్రాంతికిరన్ గారు నీటిని విడుదల చేశారు.
ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 27.115 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు లోకి మరో 33వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశాలున్నాయని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. జల విద్యుత్ కేంద్రంలో 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మంజీర పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే క్రాంతికిరన్ గారు సూచించారు. ప్రతి ఎకరాకు నీళ్ళందించదమే కేసీఆర్ కల అని ఎమ్మెల్యే క్రాంతికిరన్ అన్నారు.
జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధనపై చర్చ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశంలోని ప్రయోగశాల…
పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్…
పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా కోకో క్రీడలు విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్…
ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : శుక్రవారం జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి…
-లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ -క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థి దశ…