Hyderabad

వాహనాల రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్….

వాహనాల రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్…..

హైదరాబాద్:

వాహనాలకు దేశవ్యాప్తంగా ఒకే పర్మిట్​ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానంతో రాష్ట్రాలు మారినప్పుడల్లా రిజిస్ట్రేషన్​ ఫీజులు, రోడ్​ టాక్స్​లు చెల్లించకుండానే వ్యక్తిగత వాహనాల్లో దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది. వన్​ నేషన్​-వన్​ పర్మిట్​ విధానంలో భాగంగా రాష్ట్రాల మధ్య ఇబ్బందులు లేని రాకపోకలకు అవకాశం కల్పించాలని ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను సిద్దం చేస్తోంది. ఈ పైలెట్​ ప్రాజెక్టును ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగులు, యాజమాన్యాలకు సంబంధించిన వ్యక్తిగత వాహనాలకు ప్రతిపాదించింది.

ఉద్యోగ రీత్యా వీరంతా తరచూ ఇతర రాష్ట్రాలకు బదిలీ అవుతుంటారు. దీంతో కొత్త రాష్ట్రంలో తమ వాహనాలను మళ్లీ రిజిస్ట్రేషన్​ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ఆయా వాహనాలకు ‘IN’ రిజిస్ట్రేషన్​ నంబర్లను కేటాయించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ రిజిస్ట్రేషన్​​ చేసుకునే క్రమంలో వారు రెండు సంవత్సరాల మొత్తానికి ఒకేసారి రోడ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీఓకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు.

కొత్త విధానంపై ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఎవరైనా తమ వ్యక్తిగత వాహనాన్ని రిజిస్ట్రేషన్​ చేసుకోవాలనుకుంటే ఒకేసారి 15 సంవత్సరాల రోడ్​ టాక్స్​ ముందస్తుగా చెల్లించాలి. ఒకవేళ ఉద్యోగి వేరే రాష్ట్రానికి బదిలీ అయ్యి తన వాహనాన్ని తీసుకెళ్తే.. అక్కడ మిగిలిన 10 లేదా 12 సంవత్సరాల రోడ్డు టాక్స్​ చెల్లించాల్సి వస్తుంది. దీంతో తమ సొంత రాష్ట్రంలో 15 సంవత్సరాలకు రోడ్డు టాక్స్​ చెల్లించినప్పటికీ మళ్లీ ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల వాహనదారుడిపై అదనపు భారం పడుతుంది. అయితే కొత్త పాలసీ ఇలాంటి సమస్యను దూరం చేస్తుంది’ అని వివరించారు.

యూనిఫామ్​ రోడ్​ టాక్స్​ పాలసీ..
రోడ్డు టాక్స్​ మొత్తాన్ని ఆటోమేటిక్​గా రాష్ట్రాల మధ్య ట్రాన్స్​ఫర్​ చేసే సిస్టమ్​తోనే ఈ సమస్యకు చెక్​ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే దీని కోసం అన్ని రాష్ట్రాలు ఒకే బోర్డు మీదకు రావాల్సిన అవసరం ఉంది. కానీ రోడ్ టాక్స్ స్లాబ్ రేట్లు ఒక్కో రాష్ట్రంలో ఒకలా ఉన్నాయని, అందువల్ల అన్ని స్లాబ్​లను ఒకే తాటిపైకి తేవడం ఇబ్బందిగా మారిందని అధికారులు అంటున్నారు. దీనికి చెక్​ పెట్టేందుకు దేశమంతటా యూనిఫామ్​ రోడ్​ టాక్స్​ రేట్లను ఖరారు చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనల ప్రకారం రూ. 10 లక్షల వరకు ఖరీదు చేసే వాహనాలకు 8%, 20 లక్షలకు పైగా ఖరీదు చేసే వాహనాలకు 12% రోడ్​ టాక్స్​ను నిర్ణయించింది. ఏ రాష్ట్ర ఆదాయానికి గండిపడకుండా మద్యే మార్గంగా ఈ ధరలను నిర్ణయించినట్లు ఉన్నతాధికారి తెలిపారు.

రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీని సులభతరం చేయడానికి దేశమంతటా ‘యూనిఫామ్​ రోడ్ టాక్స్’ విధానం ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తోంది. కానీ అది విజయవంతం కాలేదు. అయితే కొత్త విధానం ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Venu

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

14 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago