Telangana

పదవి లేకున్నా ప్రజా సేవలోనే ఉంటా నీలం మధు ముదిరాజ్

పదవులు ముఖ్యం కాదు

ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తా

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు

జిటిన్ కాలనీలో విద్యుత్ స్తంభాలు, తెనుగు బస్తీలో బోర్ వాటర్ సమస్యలకు పరిష్కారం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదని అధికారం ఉన్న లేకపోయినా ప్రజాసేవలో నిమగ్నమవుతామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు.మంగళవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ని చిట్కుల్ లో పలు వార్డు లలో స్థానిక కౌన్సెలర్ నీలం కవిత, సంతోష దస్తగిరి, జ్యోతి గోపాల్ గార్లతో కలిసి పర్యటించి ఎన్నికల సందర్భంగా గుర్తించిన సమస్యలను తీర్చే విషయంలో భాగంగా విద్యుత్ స్థంబాల సమస్య, బోర్ వాటర్ సమస్య, వీధి దీపాల సమస్య ను అక్కడిక్కడే పరిష్కరించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని ప్రజలు ఓటేసి ఆశీర్వదించినా కొందరు కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీ కి మున్సిపల్ లో అధికారం దక్కకుండా చేశారని ఆరోపించారు. అయిన ఈ కుట్రలకు బెదిరేది లేదని ఎవరెన్ని కుట్రలు చేసినా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. ప్రజా సేవకు పదవులే అక్కర్లేదని తనను నమ్ముకున్న వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మన ప్రాంతానికి ప్రత్యేక నిధులు తీసుకుని వచ్చి ఎన్నికలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు వెంకటేష్, మురళి, విఠల్, శ్రీను, విష్ణు, అంజి రెడ్డి,స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago