మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో చివరి ఏడాది బీ.టెక్. (సీఎస్ఈ) విద్యార్థి ఎస్.వీరంద్ర ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అరీనాలో నిర్వహించిన ఐదవ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కప్-2026 పోటీలలో రెండు కాంస్య పతకాలు సాధించారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దాదాపు పది దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. సీనియర్ కేటగిరీలో పోటీపడిన వీరంద్ర అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆయనతో పాటు తెలంగాణ బృందంలోని ఇతర సభ్యులు కూడా ప్రతిభ కనబరచి కిక్ లైట్, లైట్ కాంటాక్ట్, జూనియర్ విభాగాలలో బంగారు, వెండి పతకాలను గెలుచుకున్నారు.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. నారాయణరావు చౌదరి తదితరులు వీరంద్ర సాధించిన విజయానికి అభినందనలు తెలియజేశారు. ఆయన అంకితభావాన్ని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీలలో రాణించడానికి కృషి చేయమని ప్రోత్సహించారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…