మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో చివరి ఏడాది బీ.టెక్. (సీఎస్ఈ) విద్యార్థి ఎస్.వీరంద్ర ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అరీనాలో నిర్వహించిన ఐదవ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కప్-2026 పోటీలలో రెండు కాంస్య పతకాలు సాధించారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దాదాపు పది దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. సీనియర్ కేటగిరీలో పోటీపడిన వీరంద్ర అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆయనతో పాటు తెలంగాణ బృందంలోని ఇతర సభ్యులు కూడా ప్రతిభ కనబరచి కిక్ లైట్, లైట్ కాంటాక్ట్, జూనియర్ విభాగాలలో బంగారు, వెండి పతకాలను గెలుచుకున్నారు.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. నారాయణరావు చౌదరి తదితరులు వీరంద్ర సాధించిన విజయానికి అభినందనలు తెలియజేశారు. ఆయన అంకితభావాన్ని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీలలో రాణించడానికి కృషి చేయమని ప్రోత్సహించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…