_ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం..
_ముదిరాజులమంత కాంగ్రెస్ కి రుణపడి ఉంటాం ..
_17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటాం..
_సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం
16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.
16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ చిట్కుల్ లోని తన క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు. 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా కులాల వారందరికీ చేయూత దొరుకుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయన్ని తెలంగాణ సమాజం స్వాగతిస్తుందన్నారు. ముదిరాజ్ కులస్తుల చిరకాల స్వప్నమైన ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో ఏఐసీసీ ఇంచార్జి దీపా దాస్ మున్షీ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చలని విన్నవించడం జరిగిందన్నారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన వారిద్దరూ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే 16 కార్పొరేషన్ ల ఏర్పాటులో ముదిరాజ్ కులానికి సైతం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు.ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుతో ముదిరాజ్ కులస్తులకు సామాజికంగా ఆర్థికంగా న్యాయం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో అందరి సహకారంతో కార్పొరేషన్ ను మరింత బలోపేతం చేసుకుని ముదిరాజ్ యువతకు చేయూతని అందించే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు.
త్వరలోనే ముదిరాజ్ కులస్తులందరూ కోరుకుంటున్న విధంగా బీసీ “డీ” నుంచి బీసీ “ఏ” లోకి మార్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుతో ముదిరాజులంతా కాంగ్రెస్ పక్షాన నిలబడాలని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గ పక్షాన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యాదయ్య,రాములు,వెంకటేశ్,మురళి, కృష్ణ,ప్రభు,గోపాల్,అశోక్,శ్రీను,వెంకటేశ్, రాజ్ కుమార్,అంతయ్యా,కార్యకర్తలు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…