సంగారెడ్డి
బాసరలో ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన నిరుపేద కుటుంబానికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ 50 వేల ఆర్థిక సాయం అందించారు . పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం వీరభద్ర నగర్ కాలనీకి చెందిన విద్యార్థిని రాహీ కుమారి త్రిబుల్ ఐటీ 434 ర్యాంకు సాధించింది. విద్యార్థిని చదువు కోసం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేసి ఉదారత చాటుకున్నారు.
రోజు కూలీగా పని చేస్తున్న గోవింద్ ఝా, సరిత ఝా దంపతుల కూతురు రాహీ కుమారి త్రిబుల్ ఐటీలో మంచి ర్యాంకు సాధించింది. శుక్రవారం పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని సర్పంచ్ నీలం మధు నివాసంలో విద్యార్థిని రాహీ కుమారి తన తల్లిదండ్రులతో వచ్చి కలిసింది. బాసరలో ట్రిపుల్ ఐటీ సీటు సాధించినందుకు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ రాహీ కుమారుని అభినందించి, శాలువాతో సత్కరించారు. ఆమె చదువు కోసం ల్యాప్ టాప్ కావాలని కోరగా సర్పంచ్ నీలం మధు 50 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ బాసర ఐఐఐటిలో సీటు సాధించడం చాలా గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు గ్యారాల మల్లేష్ ముదిరాజ్, మాంబాపూర్ ఉపసర్పంచ్ తలారి దయానంద్, ఆనంతారం మాజీ ఉప సర్పంచ్ గోపాల్, బొంతపల్లి పంచాయతీ వార్డు సభ్యులు వినోద్, అన్నారం వార్డు సభ్యులు దర్గా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…