సంగారెడ్డి
బాసరలో ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన నిరుపేద కుటుంబానికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ 50 వేల ఆర్థిక సాయం అందించారు . పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం వీరభద్ర నగర్ కాలనీకి చెందిన విద్యార్థిని రాహీ కుమారి త్రిబుల్ ఐటీ 434 ర్యాంకు సాధించింది. విద్యార్థిని చదువు కోసం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేసి ఉదారత చాటుకున్నారు.
రోజు కూలీగా పని చేస్తున్న గోవింద్ ఝా, సరిత ఝా దంపతుల కూతురు రాహీ కుమారి త్రిబుల్ ఐటీలో మంచి ర్యాంకు సాధించింది. శుక్రవారం పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని సర్పంచ్ నీలం మధు నివాసంలో విద్యార్థిని రాహీ కుమారి తన తల్లిదండ్రులతో వచ్చి కలిసింది. బాసరలో ట్రిపుల్ ఐటీ సీటు సాధించినందుకు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ రాహీ కుమారుని అభినందించి, శాలువాతో సత్కరించారు. ఆమె చదువు కోసం ల్యాప్ టాప్ కావాలని కోరగా సర్పంచ్ నీలం మధు 50 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ బాసర ఐఐఐటిలో సీటు సాధించడం చాలా గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు గ్యారాల మల్లేష్ ముదిరాజ్, మాంబాపూర్ ఉపసర్పంచ్ తలారి దయానంద్, ఆనంతారం మాజీ ఉప సర్పంచ్ గోపాల్, బొంతపల్లి పంచాయతీ వార్డు సభ్యులు వినోద్, అన్నారం వార్డు సభ్యులు దర్గా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…