సంగారెడ్డి
బాసరలో ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన నిరుపేద కుటుంబానికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ 50 వేల ఆర్థిక సాయం అందించారు . పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం వీరభద్ర నగర్ కాలనీకి చెందిన విద్యార్థిని రాహీ కుమారి త్రిబుల్ ఐటీ 434 ర్యాంకు సాధించింది. విద్యార్థిని చదువు కోసం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేసి ఉదారత చాటుకున్నారు.
రోజు కూలీగా పని చేస్తున్న గోవింద్ ఝా, సరిత ఝా దంపతుల కూతురు రాహీ కుమారి త్రిబుల్ ఐటీలో మంచి ర్యాంకు సాధించింది. శుక్రవారం పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని సర్పంచ్ నీలం మధు నివాసంలో విద్యార్థిని రాహీ కుమారి తన తల్లిదండ్రులతో వచ్చి కలిసింది. బాసరలో ట్రిపుల్ ఐటీ సీటు సాధించినందుకు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ రాహీ కుమారుని అభినందించి, శాలువాతో సత్కరించారు. ఆమె చదువు కోసం ల్యాప్ టాప్ కావాలని కోరగా సర్పంచ్ నీలం మధు 50 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ బాసర ఐఐఐటిలో సీటు సాధించడం చాలా గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు గ్యారాల మల్లేష్ ముదిరాజ్, మాంబాపూర్ ఉపసర్పంచ్ తలారి దయానంద్, ఆనంతారం మాజీ ఉప సర్పంచ్ గోపాల్, బొంతపల్లి పంచాయతీ వార్డు సభ్యులు వినోద్, అన్నారం వార్డు సభ్యులు దర్గా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…