సంగారెడ్డి
బాసరలో ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన నిరుపేద కుటుంబానికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ 50 వేల ఆర్థిక సాయం అందించారు . పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం వీరభద్ర నగర్ కాలనీకి చెందిన విద్యార్థిని రాహీ కుమారి త్రిబుల్ ఐటీ 434 ర్యాంకు సాధించింది. విద్యార్థిని చదువు కోసం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేసి ఉదారత చాటుకున్నారు.
రోజు కూలీగా పని చేస్తున్న గోవింద్ ఝా, సరిత ఝా దంపతుల కూతురు రాహీ కుమారి త్రిబుల్ ఐటీలో మంచి ర్యాంకు సాధించింది. శుక్రవారం పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని సర్పంచ్ నీలం మధు నివాసంలో విద్యార్థిని రాహీ కుమారి తన తల్లిదండ్రులతో వచ్చి కలిసింది. బాసరలో ట్రిపుల్ ఐటీ సీటు సాధించినందుకు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ రాహీ కుమారుని అభినందించి, శాలువాతో సత్కరించారు. ఆమె చదువు కోసం ల్యాప్ టాప్ కావాలని కోరగా సర్పంచ్ నీలం మధు 50 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ బాసర ఐఐఐటిలో సీటు సాధించడం చాలా గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు గ్యారాల మల్లేష్ ముదిరాజ్, మాంబాపూర్ ఉపసర్పంచ్ తలారి దయానంద్, ఆనంతారం మాజీ ఉప సర్పంచ్ గోపాల్, బొంతపల్లి పంచాయతీ వార్డు సభ్యులు వినోద్, అన్నారం వార్డు సభ్యులు దర్గా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…