పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఏఐసీసీ నూతన ఇన్చార్జిగా నియమితులై బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్ ను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటేస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ మర్యాద పూర్వకంగా కలిశారు.శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో నీలం మధు పాల్గొని నూతన ఇంచార్జ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఢిల్లీ నుంచి రైలు లో హైదరాబాద్ చేరుకుని గాంధీభవన్ కు వచ్చిన ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు, పీసీసీ సభ్యులతో కలిసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఏఐసీసీ నూతన ఇన్చార్జి గా నియమితులైన మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో యువతకు పెద్ద పీఠ వేస్తున్నారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒకరికి కాంగ్రెస్ లో గుర్తింపు ఉంటుందనడానికి మీనాక్షి నటరాజన్ నియామకం ఉదాహరణగా ఆయన అభివర్ణించారు.
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు…
మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…