Telangana

మిస్‌ అండ్ మిసెస్‌ స్ట్రాంగ్‌ అండ్ బ్యూటిఫుల్‌ ఆడిషన్స్

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : 

మిస్‌ అండ్ మిసెస్‌ స్ట్రాంగ్‌ – బ్యూటిఫుల్‌ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ ఆడిషన్స్‌ ఆకట్టుకున్నాయి.మాసాబ్‌ ట్యాంక్‌ లోని జేఎన్ఎఫ్ యూలో శుక్రవారం నాడు ఉదయం యువతులతో పాటు వివాహిత మహిళల కోసం ఈ పోటీలకు ఆడిషన్స్‌ జరిగాయి. వీరిలో వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్‌ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెందిన వారు కూడా హుషారుగా పాలుపంచుకున్నారు.

అందం, అంతకు మించి ప్రతిభావంతులైన 100 మంది మహిళలు హాజరైన ఆడిషన్స్‌ కు సినీ నటుడు నోయెల్, మిస్ ఇండియా సెకండ్ రన్నర్ అప్ 2023 నిషితా మిశ్రా, ఫిలాంత్రపిస్ట్ సిద్దూరెడ్డి కందకట్ల, మిసెస్ ఏషియా గ్రేట్ బ్రిటన్ రన్నరప్ ప్రీతి, కతక్ నృత్యారిణి సంధ్య న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జ్యూరీల ప్రశ్నలకు వారు సమాధానాలను సందిస్తూ, ర్యాంప్ వాక్ తో కనువిందు చేశారు. వారి నడక, నడత, శక్తియుక్తులను విశ్లేషణ చేసి 50 మంది ఫైనలిస్ట్స్ ను ఎంపిక చేశారు.

ఈ మార్చి 29 న నగరంలో జరుగనున్న గ్రాండ్‌ ఫినాలే లో ఈ 50 మంది ఫైనలిస్ట్‌లు పోటీ పడనున్నారని మిస్‌ అండ్ మిసెస్‌ స్ట్రాంగ్‌ అండ్ బ్యూటిఫుల్‌ వ్యవస్థాపకురాలు కిరణ్మయి అలివేలు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, ఆరోగ్యం పోషకాహారంపై, అలాగే క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు సాధికారత కల్పించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు. ‘మహిళలు తమ అందం మాత్రమే కాక మేధస్సు, శక్తి యుక్తులను గుర్తించి విజయాలు అధిరోహించేలా చెయ్యడం తమ లక్ష్యం గా పేర్కొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago